రాజకీయాల్లో కుటుంబ కథా చిత్రం
రాజకీయపరంగా కుటుంబ కలహాలు సర్వ సాధారణమే. పలుచోట్ల ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా తలపడుతున్న విషయం తెలిసిందే.
ఖగుపతి ప్రధాని (పాత చిత్రం)
సిమిలిగుడ, న్యూస్టుడే: రాజకీయపరంగా కుటుంబ కలహాలు సర్వ సాధారణమే. పలుచోట్ల ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా తలపడుతున్న విషయం తెలిసిందే. నవరంగపూర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి పిన్ని, కొడుకులు రెండు ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో పోటీ చేయడం చర్చనీయాంశమైంది. రాజకీయంలో చక్రం తిప్పిన ఖగుపతి ప్రధాని కుటుంబంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన 1967లో తొలిసారిగా కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998ల్లో నవరంగపూర్ ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. అనంతరం ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు. అనంతరం ఖగుపతి తమ్ముడు గోపీనాథ్ నవరంగపూర్ జిల్లా పరిషత్ మొదటి అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన కుమారుడు సదాశివ 2019లో బిజద తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖగుపతి మనవడు దిలీప్ తాత పని చేసే కాంగ్రెస్లో ఉంటూ సర్పంచిగా, సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. దిలీప్, సదాశివ కుటుంబ సభ్యులు ఇరుపార్టీల్లో చేరడంతో వారి మధ్య వైరం ఏర్పడింది.
కౌసల్య , దిలీప్ ప్రధాని
మళ్లీ తెరపైకి
రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ ప్రధాని కుటుంబం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. నవరంగపూర్ నుంచి బిజద అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివ సతీమణి కౌసల్య రంగంలో దిగుతున్నారు. ఆమెకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ దిలీప్కు టికెట్ కేటాయించింది. దీంతో ఎన్నికల రంగంలో పిన్నితో కొడుకు తలపడనున్నాడు. దశాబ్దాల రాజకీయ చరిత్ర గల ప్రధాని కుటుంబంలో ప్రత్యర్థులుగా బరిలో ఉండడం విశేషం. కాంగ్రెస్ తరఫున నవరంగపూర్ లోక్సభ స్థానం నుంచి భుజబల్ మాఝి, డాబుగావ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె లిపికా మాఝి పోటీ చేయడం మరో ఆసక్తికర విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
7,303 కేంద్రాల్లో నేడు పోలింగ్
[ 13-05-2024]
రాష్ట్రంలో ఓట్ల పండగకు తెరలేచింది. తొలివిడతగా సోమవారం పోలింగ్ జరగనున్న 4 లోక్సభ, 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. -
మావోయిస్ట్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు: డీజీపీ
[ 13-05-2024]
తొలివిడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. ఆదివారం భువనేశ్వర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను నియమించామని, పెట్రోలింగ్ ముమ్మరంగా జరుగుతోందన్నారు. -
15న బొలంగీర్కు రాహుల్ రాక
[ 13-05-2024]
ఈ నెల 15న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బొలంగీర్ రానున్నారు. ఈమేరకు పార్టీ బొలంగీర్ అసెంబ్లీ అభ్యర్థి సమరేంద్ర మిశ్ర ఆదివారం విలేకరులకు చెప్పారు. -
16 మార్గాల్లో బస్సు సేవలు నిలిపివేత
[ 13-05-2024]
రాష్ట్రంలో మొదట విడత ఎన్నికలు సోమవారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జయపురం నుంచి 16 మార్గాలకు వెళ్లే బస్సు రవాణా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. -
280 మంది రాజకీయ భవిష్యత్తు తేలేది నేడే
[ 13-05-2024]
రాష్ట్రంలో తొలిదశ పోలింగ్ జరగనున్న నాలుగు లోక్సభ, 28 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 280 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు సోమవారం తేలనుంది. తొలిదశలో 62 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
ఒడి‘సై’ అంటున్న భాజపా
[ 13-05-2024]
బిజదతో మాకు ఎలాంటి మైత్రీ బంధం, అవగాహన లేదని స్పష్టంగా చెప్పేసిన భాజపా నాయకత్వం ఈసారి రాష్ట్ర పాలనా పగ్గాలు చేజిక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు, హైటెక్ ప్రచారం శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. -
గుణుపురంలో త్రిముఖ పోరు.. విజేత ఎవరు?
[ 13-05-2024]
రాయగడ జిల్లా గుణుపురంలో ప్రచార పర్వం ముగిసింది. విజేత ఎవరో నిర్ణయించే సమయం వచ్చింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. తెల్లవారితే పోలింగ్. గుణుపురం నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, త్రిముఖ పోరు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. -
భాజపా నేతలది మొసలి కన్నీరు: నవీన్
[ 13-05-2024]
భాజపా నేతలది మొసలి కన్నీరని, వారిని విశ్వసించొద్దని, చెప్పింది చేయరని, రాష్ట్రానికి వారు చేసిందేమీలేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. సోమవారం బొలంగీర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన తాను నామినేషన దాఖలు చేసిన కంటాబంజి అసెంబ్లీ సెగ్మెంటులోని బంగముండ, మురిబిహాల్, కొలాముండల ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. -
సీఎం పంజరంలో చిలుక
[ 13-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పంజరంలో చిలుకలా మారారని, తన చుట్టూ ఉన్నవారు ఏం చెబితే దాన్ని ప్రజలకు వినిపిస్తున్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆదివారం సంబల్పూర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... -
పార్టీల కంటే అభ్యర్థులే ముఖ్యం
[ 13-05-2024]
బ్రహ్మపుర లోక్సభ పరిధిలోని మోహన నియోజకవర్గం గజపతి జిల్లాలో పెద్దది. మోహన గతంలో దిగపొహండి నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఈ స్థానం నుంచి దివంగత మాజీ స్పీకర్, మంత్రి సూర్యనారాయణ పాత్ర్ బిజద తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవారు.