‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు.
రాయగడ, న్యూస్టుడే: రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. వీరిద్దరికీ నియోజకవర్గంలో పట్టున్నప్పటికీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు సరకపై వ్యతిరేకత కనబరుస్తున్నాయి. పర్యటనకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గ్రామస్థులు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేసి నీరందించాలని కోరారు. సరక అనుచరులు వారిపై దాడికి ప్రయత్నించడంతో ఆయనపై కేసు నమోదైంది. సరక 2009లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కురువృద్ధుడు డొంబురు దొర ఉలకతో పోటీపడి ఓటమి పాలయ్యారు. 2014, 2019లలో బరిలో దిగిన ఈయనకు పార్టీ సీనియర్ నాయకుడు నెక్కంటి భాస్కరరావు పూర్తి సహకారం అందించడంతో విజయకేతనం ఎగరేశారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు భాస్కరరావును కాదని సుధీర్ దాస్, కొండబాబులతో మైత్రి సాగిస్తున్నారు. ఈసారి సరక గెలుపు సాధ్యమా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.
మాటల మాంత్రికుడు నుండ్రుక
జగన్నాథ నుండ్రుక మంచి వక్తగా పేరు పొందారు. 1979లో జన్మించిన ఈయన 2002 నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బిజద ప్రోత్సాహంతో నాలుగుసార్లు సర్పంచిగా, తర్వాత ప్రత్యేక అభివృద్ధి మండలి అధ్యక్షుడుగా పనిచేశారు. ఈసారి బిజద టికెట్ లభించకపోవడంతో ఇటీవల భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా తరఫున బరిలో ఉన్నారు. నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ ఉండబోతోందని ఊహా గానాలు వినిపిస్తున్నాయి. జగన్నాథ్లు ఇద్దరికీ ఈ ఎన్నికలు అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.