మండుటెండల్లో.. చల్లచల్లగా!
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి.
గతేడాదితో పోలిస్తే 44.37 శాతానికిపైగా పెరిగిన బీరు విక్రయాలు
25 రోజుల్లో అమ్ముడుపోయిన 19.65 లక్షల పెట్టెలు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. కేవలం 25 రోజుల్లో 19 లక్షలకుపైగా పెట్టెల బీర్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి తీవ్రత ఎంతుందో అర్థమవుతోంది. గతేడాదితో పోలిస్తే వీటి విక్రయాలు 44 శాతానికిపైగా పెరగడం గమనార్హం. అబ్కారీ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 19.65 లక్షల పెట్టెల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 13.61 లక్షలు అమ్ముడుపోగా, ఈ ఏడాది బీరు విక్రయాలు 44.37 శాతం పెరిగాయి. ఒక్కో పెట్టెలో 24 బీరు సీసాలు లేదా క్యాన్లు ఉంటాయని పేర్కొన్న అబ్కారీశాఖ వర్గాలు గతంలో ఏప్రిల్ నెలలో వీటి విక్రయాలను 26 నుంచి 27 శాతం మాత్రమే పెరిగినట్లు వెల్లడించాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి 23 శాతం మేర బీరు విక్రయాలు పెరిగాయని ఆశాఖ పేర్కొంది.
అరకొరగా పెరిగిన విదేశీ మద్యం విక్రయాలు: పెరిగిన ఎండల వల్లే బీరు విక్రయాలు పెరిగినట్లు భావిస్తోన్న అబ్కారీ శాఖ వర్గాలు విదేశీ మద్యం విక్రయాల్లో స్పల్ప తేడా కనిపించడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి 25 మధ్య 3.38 లక్షల విదేశీ మద్యం పెట్టెలు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఇదే సమయంలో ఈ విక్రయాలు కేవలం 3.42 లక్షల పెట్టెలకు మాత్రమే పరిమితమైనట్లు ఆ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. అదే మార్చి విషయానికొస్తే గతేడాది 9.47 లక్షల పెట్టెలు విక్రయించగా, ఈ ఏడాది 10.49 లక్షల పెట్టెలుగా నమోదు కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.10,160 కోట్ల ఆదాయం సమకూరినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజధాని స్థానం... ఎవరి సొంతం?
[ 14-05-2024]
రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న రాజధాని నగరంలో ఎన్నికల వేడి ఎండ తీవ్రతను మించిపోయింది. -
ఓటేసిన అభ్యర్థులు.. ప్రముఖులు
[ 14-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
స్వల్ప ఘటనలు మినహా తొలివిడత ప్రశాంతం
[ 14-05-2024]
రాష్ట్రంలో సోమవారం తొలివిడత పోలింగులో స్వల్ప ఘటనలు మినహాయిస్తే ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజబిహారీ ధొళో భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
పోలింగ్ బహిష్కరణ...
[ 14-05-2024]
మొదటివిడత పోలింగు రోజున పలు జిల్లాల్లోని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. -
ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్లో అక్రమానికి పాల్పడిన ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళొ సోమవారం సాయంత్రం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఉత్సాహంగా ఓట్ల పండగలో...
[ 14-05-2024]
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ సోమవారం పూర్తయింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఆనందమానందమాయె
[ 14-05-2024]
చందనయాత్ర నేపథ్యంలో పూరీ తూర్పు తీరధామం ఆనందసాగరాన్ని తలపిస్తోంది. -
బైజయంత్కు మతి భ్రమించింది: అమర్
[ 14-05-2024]
భాజపా నేత బైజయంత్ పండాకు మతి భ్రమించిందని బిజద అధికార ప్రతినిధి అమర్ పట్నాయక్ అన్నారు. -
మూడు ట్రక్కుల ఢీ
[ 14-05-2024]
ఘటాల్- పంచుకురా రహదారిపై ఆదివారం మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి