కుమారుడిని నరికి చంపిన తండ్రి
నవరంగపూర్ జిల్లా నందపండి సమితి టెంటులిఘంటి పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండ్ర గ్రామంలో కన్న తండ్రి తన కుమారుడిని కత్తితో నరికి చంపిన ఘటన చర్చనీయాంశమైంది.
నవరంగపూర్: నవరంగపూర్ జిల్లా నందపండి సమితి టెంటులిఘంటి పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండ్ర గ్రామంలో కన్న తండ్రి తన కుమారుడిని కత్తితో నరికి చంపిన ఘటన చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన జోగేశ్వర్ నాయక్ ఆదివారం మద్యం తాగి.. ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. అతడిని సముదాయించేందుకు పెద్ద కుమారుడు దేవ్ నాయక్ (22), సోదరుడు అభిమన్యు ఇంటి బయటకు తీసుకొచ్చారు. జోగేశ్వర్కు నచ్చజెప్పుతుండగా, మద్యం మత్తులో మరింత కోపోద్రిక్తుడై కుమారుడిని కత్తిలో నరికాడు. అడ్డు వచ్చిన సోదరుడిపై దాడి చేయడంతో అభిమన్యు స్వల్పంగా గాయపడ్డాడు. దేవ్ కేకలు విని చుట్టుపక్కలవారు వెంటనే అంబులెన్స్లో అతడిని ఆసుపత్రికి తరలించంగా అప్పటికే దేవ్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం శవ పరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జోగేశ్వర్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువకుడిపై దుండగుల కాల్పులు
[ 16-05-2024]
గంజాం జిల్లా పొలసర పోలీసు స్టేషన్ పరిధిలోని తోలాసాహి కూడలిలో రహదారి పక్కన నిలబడి ఉన్న ఓ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్థుల రాస్తారోకో
[ 16-05-2024]
ఈ ఏడాది వర్షాలు కురవక గజపతి జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి నారాయణపురం గ్రామస్థులు పర్లాఖెముండి -మెహన -బ్రహ్మపురం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
[ 16-05-2024]
గంజాం జిల్లా కళ్లికోట పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ శరణపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఎన్నికల పోస్టర్లను అతికించిన నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. -
రాజులకి ఆదరణ.. బిజద, కాంగ్రెస్లు నిలువరించేనా?
[ 16-05-2024]
మూడుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన రాణి సంగీతాకు జనాదరణ కనిపిస్తోంది. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
నవీన్ 25 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి
[ 16-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి శాపమని, అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఒడియాయేతరులైన అధికారుల చేతికి పాలనా పగ్గాలు అప్పగించి ప్రజలకు సీఎం నిరాశ మిగిల్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. -
జులై నుంచి ఉచిత విద్యుత్తు
[ 16-05-2024]
రానున్న జులై నుంచి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని, 90 శాతం ప్రజలకు బిల్లులు రావని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
రెండో విడతలో 95 మంది కోటీశ్వరులు
[ 16-05-2024]
ఈ నెల 20న రెండో విడతలో 5 లోక్సభ, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 265 మంది శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. వీరిలో 87 మంది నేరచరితులున్నారు. -
అస్కా లోక్సభ స్థానం ఎవరికి దక్కేనో..?
[ 16-05-2024]
గంజాం జిల్లాలోని లోక్సభ స్థానాల్లో అస్కా కీలకమైంది. ఈ స్థానంలో పట్టు సాధించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
మాజీ మంత్రి డొంబురధర కన్నుమూత
[ 16-05-2024]
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొంబురధర ఉలక (87) మంగళవారం అర్ధరాత్రి భువనేశ్వర్లోని ప్రవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. -
ఒడిశాలో కాంగ్రెస్ అధికారానికొస్తుంది: రాహుల్
[ 16-05-2024]
ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. బుధవారం బొలంగీర్ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. -
రాష్ట్రానికి భాజపా అగ్రనేతలు
[ 16-05-2024]
ఒడిశాలో అధికారం దక్కించుకోవాలన్న భాజపా నాయకత్వం ఈ దిశగా సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉన్నందున అగ్రనేతలంతా ప్రచారానికి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ బుధవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
రోజు కూలీ.. రాజ మేస్త్రీల ప్రచారం
[ 16-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అస్కా, భంజనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ అభ్యర్థులుగా రోజు కూలీ టునా మల్లిక్, రాజ మేస్త్రీ రామచంద్ర బడత్యాలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
గుక్కెడు నీటికి కడివెడు కష్టం
[ 16-05-2024]
కొరాపుట్ జిల్లాలో వేసవి ప్రారంభం నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీటికోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి అన్వేషణతోనే రోజు మొదలవుతుంది. -
ప్రదీప్ పాణిగ్రహిపై దాడి వెనుక కుట్ర కోణముంది
[ 16-05-2024]
బ్రహ్మపుర గుసానినువాగాం పోలింగు కేంద్రం సమీపాన ఎన్నికల రోజున రాత్రి బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు) దాడి చేయడం వెనుక కుట్ర కోణముందని భాజపా నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. -
గోశాల కాదు.. కొరాపుట్ బస్టాండ్
[ 16-05-2024]
జిల్లాకేంద్రం కొరాపుట్ బస్టాండ్లో ఎక్కువగా పశువులు తిరుగుతుండడంతో గోశాలను తలపిస్తోంది. బస్స్టాండ్ భవనం ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లు ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
బంజారాహిల్స్లో నాలాపై కుంగిన రోడ్డు.. రాత్రికి వడగళ్ల వర్షం పడే అవకాశం!
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!