logo

కుమారుడిని నరికి చంపిన తండ్రి

నవరంగపూర్ జిల్లా నందపండి సమితి టెంటులిఘంటి పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండ్ర గ్రామంలో కన్న తండ్రి తన కుమారుడిని కత్తితో నరికి చంపిన ఘటన చర్చనీయాంశమైంది.

Published : 29 Apr 2024 15:54 IST

నవరంగపూర్‌: నవరంగపూర్ జిల్లా నందపండి సమితి టెంటులిఘంటి పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న దండ్ర గ్రామంలో కన్న తండ్రి తన కుమారుడిని కత్తితో నరికి చంపిన ఘటన చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన జోగేశ్వర్ నాయక్‌ ఆదివారం మద్యం తాగి.. ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. అతడిని సముదాయించేందుకు పెద్ద కుమారుడు దేవ్ నాయక్ (22), సోదరుడు అభిమన్యు ఇంటి బయటకు తీసుకొచ్చారు. జోగేశ్వర్‌కు నచ్చజెప్పుతుండగా, మద్యం మత్తులో మరింత కోపోద్రిక్తుడై కుమారుడిని కత్తిలో నరికాడు. అడ్డు వచ్చిన సోదరుడిపై దాడి చేయడంతో అభిమన్యు స్వల్పంగా గాయపడ్డాడు. దేవ్‌ కేకలు విని చుట్టుపక్కలవారు వెంటనే అంబులెన్స్‌లో అతడిని ఆసుపత్రికి తరలించంగా అప్పటికే దేవ్‌ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం శవ పరీక్ష అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జోగేశ్వర్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని