logo

ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో నవరంగపూర్‌కు కాంస్యం

దుబాయిలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో నవరంగపుర్‌ జిల్లాకు చెందిన బాలుడు విజయం సాధించాడు.

Updated : 29 Apr 2024 17:14 IST

నవరంగపుర్‌: దుబాయిలో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో నవరంగపుర్‌ జిల్లాకు చెందిన బాలుడు విజయం సాధించాడు. ఉమ్మర్‌కోట్‌కు చెందిన మహేంద్ర శాంటా  400 మీటర్ల పరుగు పందెంలో భారత్ తరఫున ఆడి కాంస్య పథకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించిన మహేంద్రను భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఈ సందర్భంగా తండ్రి బిశ్వ శాంటా ముట్లాడుతూ.. మారుమూల ప్రాంతానికి చెందిన కుమారుడు ఇంతటి విజయం సాధించటం గర్వకారణంగా ఉదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరెన్నో విజయాలు సాధించి జిల్లా, రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతాడని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని