కూలీ పనికి వెళ్ళిన బాలిక, యువతి అదృశ్యం
కూలీ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి బాలిక, యువతి అదృశ్యమైన ఘటన నవరంగపూర్ జిల్లా రాయ్ఘర్ సమితి మహడ గ్రామంలో చోటుచేసుకుంది.
నవరంగపూర్: కూలీ పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి బాలిక, యువతి అదృశ్యమైన ఘటన నవరంగపూర్ జిల్లా రాయ్ఘర్ సమితి మహడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జహబులాల్ గండ్ కుమారై దీపాళి (16), నయాల్ గండ్ కుమ్మ అంజలి గండ్ (20) ఎనిమిది నెలల క్రితం గురుసింగ్ గ్రామానికి చెందిన దళారీ దేవేంద్ర కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కు కూలీ పనికి వెళ్ళారు. నెలలు గడుస్తున్నా తమ కుమార్తెల నుంచి ఒక్క ఫోన్ రాకపోవటంతో, దళారి వద్దకు వెళ్ళి తమ కుమార్తెల ఆచూకీపై ఆరా తీశారు. దేవేంద్ర దురుసుగా సమాధానం ఇవ్వటంతో 15రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేపట్టకపోవడంతో మీడియాను సహాయం కోరారు. దీనిపై ఠాణాధికారి రఘునాథ్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసుకొని దళారిని దర్యాప్తు చేసేందుకు వెళ్లగా అతడు పరారయ్యడని పేర్కొన్నారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. తమ కుమార్తెలను అమ్మేశారా లేక అప్పగించేశారా? వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు పాలనాధికారి డా. కమల్ లోచన్ మిశ్రా దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే జిల్లా కార్మిక శాఖాధికారితో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువకుడిపై దుండగుల కాల్పులు
[ 16-05-2024]
గంజాం జిల్లా పొలసర పోలీసు స్టేషన్ పరిధిలోని తోలాసాహి కూడలిలో రహదారి పక్కన నిలబడి ఉన్న ఓ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్థుల రాస్తారోకో
[ 16-05-2024]
ఈ ఏడాది వర్షాలు కురవక గజపతి జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి నారాయణపురం గ్రామస్థులు పర్లాఖెముండి -మెహన -బ్రహ్మపురం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
[ 16-05-2024]
గంజాం జిల్లా కళ్లికోట పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ శరణపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఎన్నికల పోస్టర్లను అతికించిన నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. -
రాజులకి ఆదరణ.. బిజద, కాంగ్రెస్లు నిలువరించేనా?
[ 16-05-2024]
మూడుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన రాణి సంగీతాకు జనాదరణ కనిపిస్తోంది. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
నవీన్ 25 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి
[ 16-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి శాపమని, అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఒడియాయేతరులైన అధికారుల చేతికి పాలనా పగ్గాలు అప్పగించి ప్రజలకు సీఎం నిరాశ మిగిల్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. -
జులై నుంచి ఉచిత విద్యుత్తు
[ 16-05-2024]
రానున్న జులై నుంచి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని, 90 శాతం ప్రజలకు బిల్లులు రావని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
రెండో విడతలో 95 మంది కోటీశ్వరులు
[ 16-05-2024]
ఈ నెల 20న రెండో విడతలో 5 లోక్సభ, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 265 మంది శాసనసభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. వీరిలో 87 మంది నేరచరితులున్నారు. -
అస్కా లోక్సభ స్థానం ఎవరికి దక్కేనో..?
[ 16-05-2024]
గంజాం జిల్లాలోని లోక్సభ స్థానాల్లో అస్కా కీలకమైంది. ఈ స్థానంలో పట్టు సాధించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
మాజీ మంత్రి డొంబురధర కన్నుమూత
[ 16-05-2024]
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డొంబురధర ఉలక (87) మంగళవారం అర్ధరాత్రి భువనేశ్వర్లోని ప్రవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. -
ఒడిశాలో కాంగ్రెస్ అధికారానికొస్తుంది: రాహుల్
[ 16-05-2024]
ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. బుధవారం బొలంగీర్ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. -
రాష్ట్రానికి భాజపా అగ్రనేతలు
[ 16-05-2024]
ఒడిశాలో అధికారం దక్కించుకోవాలన్న భాజపా నాయకత్వం ఈ దిశగా సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో మూడు దశల పోలింగ్ మిగిలి ఉన్నందున అగ్రనేతలంతా ప్రచారానికి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ బుధవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
రోజు కూలీ.. రాజ మేస్త్రీల ప్రచారం
[ 16-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అస్కా, భంజనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ అభ్యర్థులుగా రోజు కూలీ టునా మల్లిక్, రాజ మేస్త్రీ రామచంద్ర బడత్యాలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
గుక్కెడు నీటికి కడివెడు కష్టం
[ 16-05-2024]
కొరాపుట్ జిల్లాలో వేసవి ప్రారంభం నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీటికోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు తాగునీటి అన్వేషణతోనే రోజు మొదలవుతుంది. -
ప్రదీప్ పాణిగ్రహిపై దాడి వెనుక కుట్ర కోణముంది
[ 16-05-2024]
బ్రహ్మపుర గుసానినువాగాం పోలింగు కేంద్రం సమీపాన ఎన్నికల రోజున రాత్రి బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు) దాడి చేయడం వెనుక కుట్ర కోణముందని భాజపా నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. -
గోశాల కాదు.. కొరాపుట్ బస్టాండ్
[ 16-05-2024]
జిల్లాకేంద్రం కొరాపుట్ బస్టాండ్లో ఎక్కువగా పశువులు తిరుగుతుండడంతో గోశాలను తలపిస్తోంది. బస్స్టాండ్ భవనం ఎప్పుడు కూలిపోతుందో అన్నట్లు ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!