అమ్మా.. నా ప్రాణం నీ చేతిలోనే..
శిశు మరణాలు లేకుండా చేయాలన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. కానీ పసికందులు గర్భంలో, పుట్టిన గంటల వ్యవధిలో, వారం, రెండు వారాల్లో వివిధ కారణాలు, అనారోగ్యంతో ఊపిరి వదిలేస్తున్నారు.
న్యూస్టుడే, విజయనగరం రింగురోడ్డు
ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు గర్భం దాల్చింది మొదలు పుట్టబోయే బిడ్డ రూపం ఊహిస్తూ.. మురిసిపోతుంటుంది కాబోయే తల్లి.. తనలో ప్రాణం పోసుకుంటున్న శిశువును ముద్దాడటం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది..
కలలు కన్న ఆ రూపం చేతికందేలోపే శాశ్వతంగా దూరమైతే.. దానికి మించిన నరకం మరొకటి ఉంటుందా.. కానీ ఈ బాధను అనుభవిస్తున్నారు చాలా మంది తల్లులు.. ఉమ్మడి జిల్లాలో ఏటా నమోదు అవుతున్న శిశు మరణాలే దీనికి నిదర్శనం.
శిశు మరణాలు లేకుండా చేయాలన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. కానీ పసికందులు గర్భంలో, పుట్టిన గంటల వ్యవధిలో, వారం, రెండు వారాల్లో వివిధ కారణాలు, అనారోగ్యంతో ఊపిరి వదిలేస్తున్నారు. బాల్య వివాహాలు, పౌష్టికాహార లోపం, గర్భిణులకు అవగాహన లేకపోవడం.. ప్రసవం సమయంలో క్షేత్రస్థాయిలో సరైన వైద్య సేవలు అందకపోవడం శిశు మరణాలకు ప్రధాన కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది అధికారిక గణాంకాల ప్రకారం 212 శిశు మరణాలు సంభవించాయి. గడిచిన నాలుగేళ్లలో అధికారికంగా 220 బాల్య వివాహాలు జరిగినట్లు గుర్తించారు. అధికారుల దృష్టికి రానివి ఎన్ని ఉంటాయో తెలియదు.
హెచ్బీ ఏడు గ్రాములే..!!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణుల ఆరోగ్యం కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడమే కాకుండా.. సుఖ ప్రసవం జరిగితే ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. అయినా పౌష్టికాహార లోపంతో రక్తహీనత వల్ల ప్రసవ సమయంలో కష్టమవుతోంది. 35 నుంచి 45 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో ఉంటున్నారు. 12 గ్రాముల హెచ్బీ కచ్చితంగా ఉండాలి. రక్తం తక్కువైతే.. ఒక్కోసారి మృత్యువాత పడే అవకాశాలూ ఉన్నాయి. 7, 8 గ్రాములతో ఆసుపత్రికి వస్తున్న రోగులు ఇటీవల పెరిగారని వైద్యులు చెబుతున్నారు.
* పీహెచ్సీల పరిధిలో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ సరిగా లేకపోవడం.
* 18వ ఏటలోనే గర్భం దాల్చడం, శిశువుకు తగ్గట్టు గర్భ సంచి తయారు కాకపోవడం, బాల్య వివాహాలు.
* తక్కువ బరువుతో పుట్టడం, శ్వాసకోశ సమస్యలు.
* శిశువుకు ముర్రుపాలు ఇవ్వలేని స్థితిలో తల్లులు ఉండటం. బయట పాలు పట్టడం వల్ల ఇన్ఫెక్షన్లు.
* తీవ్ర అనారోగ్య సమయంలో శిశువులను పెద్దాసుపత్రులకు తరలించడంలో జాప్యం.
* అంబులెన్సుల్లో వెళ్తుండగా మధ్యలోనే ప్రసవాలు, సాధారణ ప్రసవం కోసం పరిస్థితి చేయిదాటేంత వరకు ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం.
* నెలకోసారి కచ్చితంగా వైద్య తనిఖీలు చేయించుకోకపోవడం. పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
మాతా, శిశు సంరక్షణే మా ప్రధాన నినాదం. హైరిస్కు కేసులను ముందుగానే గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించి తగు చికిత్సలు చేయిస్తున్నాం. చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం, గర్భధారణ పట్ల అవగాహన లేకపోవడం, ఇతరత్రా ఆలోచనలతో మానసిక సంఘర్షణకు గురికావడం వల్ల తల్లీబిడ్డలపై ప్రభావం పడుతోంది. అయినప్పటికీ ఏ ఒక్కరూ చనిపోకూడదన్న లక్ష్యంతో వైద్య సేవలు అందిస్తున్నాం. మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్వో, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ నిర్మూలనపై అవగాహన ర్యాలీ
[ 16-05-2024]
జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గురువారం డెంగీ నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేశారు. -
రైతులకు దూరం.. సేవలకు రాంరాం
[ 16-05-2024]
రైతుల కోసం... వారి ప్రయోజనం కోసం ఉద్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉనికిని కోల్పోతున్నాయి. గతంలో పలు రకాల సేవలందించినా.. నేడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
130 స్థానాలకు పైగా విజయం సాధిస్తాం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 130కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు -
ఓటరు మారాజులు 17,35,958
[ 16-05-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 106 మంది అభ్యర్థులు నిలిచారు. -
శ్రమ ఎక్కువ.. పారితోషికం తక్కువ
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రెమ్యూనరేషన్ (పారితోషికం), టీఏ/డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని రెండు జిల్లాల సిబ్బంది ఆరోపించారు. -
ఇంజినీరింగ్కే మొగ్గు
[ 16-05-2024]
నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆన్లైన్ విధానంలో ఎనిమిది రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు షిప్టులుగా పరీక్షలు జరుగుతాయి. -
ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ప్రారంభం
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు బుధవారం నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.ఆదినారాయణ తెలిపారు. -
జేఎన్టీయూలో ఈవీఎంల భద్రత
[ 16-05-2024]
ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్రూంలో భద్రపర్చే చర్యలు తీసుకున్నారు. -
అమ్మకు నిస్సత్తువ..!
[ 16-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు గత కొన్నేళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
ఇంతులు..చైతన్య కాంతులు
[ 16-05-2024]
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మొత్తం 15,62,921 మందిలో 7,92,038 మంది వీరే ఉన్నారు. -
జాతీయ భాగ్యం.. పాలకుల నిర్లక్ష్యం
[ 16-05-2024]
జిల్లాలతో పాటు పక్కనున్న ఒడిశా రాష్ట్రాన్ని కలిపే కీలక మార్గం. నిత్యం వాహనాల రద్దీ ఎక్కువ. సరకులు, ఇతరత్రా ఉత్పత్తుల రవాణా లారీలు, ప్రయాణికుల బస్సులు, ఇతర వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తుంటాయి -
అంబులెన్స్ల నిర్వహణ గాలికి
[ 16-05-2024]
పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రికి రోజుకు 550 నుంచి 600 మధ్య ఓపీ ఉంటుంది. 150 పడకల ఆసుపత్రిలో 200 మంది వరకు ఇన్పేషెంట్లు ఉంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM