సర్కార్ తెచ్చిన నీటి కరవు
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి.
నాలుగు రోజులకోసారి సరఫరా
నిర్వహణ లోపంతో ప్రజల పాట్లు
ఓంకార్ థియేటర్ కూడలిలో బిందెల వరుస
- పురపాలక: బొబ్బిలి
- వార్డులు: 31
- కుళాయిల సంఖ్య: 4 వేలు
- జనాభా: 62 వేలు
- అవసరమైన తాగునీరు: 9 ఎంఎల్డీ
- ప్రస్తుతం ఇస్తున్నది: 3 ఎంఎల్డీ
- నీటి ఎద్దడి ప్రాంతాలు: రాజామహల్, ప్రసాద్నగర్ కాలనీ, ఓంకార్ థియేటర్ సందు, బాలాజీ నగర్, కంచరవీధి, రెడ్డికవీధి, చినబజారు, గొల్లపల్లి, ఐటీఐ కాలనీ, ఇందిరమ్మకాలనీ, పాత బొబ్బిలి శివారు ప్రాంతాలు
ఇందిరమ్మ కాలనీలో ట్యాంకరు వద్ద పోటీ
బొబ్బిలి, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల లోపం.. ప్రజల పాలిట శాపంగా మారింది. నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడంతో బొబ్బిలి పట్టణ వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో మండుటెండలో మహిళలు పడిగాపులు కాస్తున్నారు. 31 వార్డుల్లోనూ సమస్య తీవ్ర రూపం దాల్చింది. తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పైపులైన్ల లీకులు, పర్యవేక్షణ గాడితప్పడంతో ఉన్న నీరు కూడా సక్రమంగా రాక అవస్థలు తప్పడం లేదు.
పట్టణానికి తాగునీరు అందించే వేగావతి నదిలో నీటి లభ్యత తగ్గింది. ఈ తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాలకులు మరింత నిర్లక్ష్యం చూపుతున్నారు. పైపులైన్ల లీకులను అరికట్టడంలో విఫలమయ్యారు. భోజరాజపురం హెడ్ వాటర్ వర్క్సు నుంచి పట్టణానికి వచ్చే ప్రధాన పైపులైను నుంచి రైల్వేస్టేషన్ కూడలి, చర్చిసెంటర్, కోరాడవీధి, దావాల వీధుల్లో లీకులు ఉన్నాయి. జనాభా నాలుగింతలు పెరిగినా తాగునీటి సరఫరా పునరుద్ధరణకు మాత్రం చర్యలు లేవు. రెండ్రోజులకోసారి కొన్ని వీధులకు రాగా, మరికొన్ని చోట్ల నాలుగు రోజులకోమారు వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వారం రోజులుగా నిర్వహణ మరింత గాడితప్పిందని చెబుతున్నారు. ఇందిరమ్మ కాలనీలో ట్యాంకర్లు వస్తేనే ప్రజల గొంతు తడుస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని పురపాలక కమిషనర్ రామలక్ష్మి ‘న్యూస్టుడే’తో పేర్కొన్నారు.
ఒక బిందె మాత్రమే..
ఓంకార్ థియేటర్ ప్రాంతంలో నాలుగు రోజుల తర్వాత కుళాయిల నుంచి నీరు వచ్చింది. అది కూడా ఎక్కువ సమయం ఇవ్వలేదు. సీరియల్లో బిందెలు పెడుతుంటే మనిషికి ఒక బిందె మాత్రమే వస్తోంది. అవి ఎటుకూ సరిపోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మున్సిపల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
పార్వతి, ఓంకార్ థియేటర్ కూడలి
ధార రావడం లేదు
గొల్లపల్లిలో కుళాయిల నుంచి సన్నటి ధార వస్తోంది. వీధిలో కుళాయిల సంఖ్య తక్కువ. ఆపై పిట్ ట్యాపులు దిగువకు ఉన్నాయి. పట్టుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయినా అందరికీ పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సరఫరా సమయం పెంచాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది.
రవణమ్మ, గొల్లపల్లి, బొబ్బిలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాతకు రక్తకన్నీరు!!
[ 11-05-2024]
కాలువలకు సంబంధించి జరిగిన పనులకు గుత్తేదారుకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. రూ.17 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ కారణంగా రబీలో తిరిగి పనులు ప్రారంభించలేదు. వచ్చే నెలతో పనులకు గడువు ముగియనుంది. -
యువ జపం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు చివరి దశకు చేరింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైకాపా, కూటమి పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా దూసుకెళ్తున్నారు. -
నోట్లకట్టలు తెగుతున్నాయ్
[ 11-05-2024]
పోలింగ్కు నాలుగు రోజుల ముందు నుంచి వైకాపా ఓటర్లను ప్రలోభ పెడుతోంది. గురువారం రాత్రి నుంచే పంపకాలు మొదలెట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన మద్యం సీసాలున్న పెట్టెలు విప్పుతున్నారు. -
ప్చ్.. గప్చుప్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 129 మంది పోటీలో ఉన్నారు. -
ప్రజా వైద్యానికి జగన్ వైరస్
[ 11-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజావైద్యానికి వైరస్ సోకింది.. సామాన్యుడికి సుస్తీ చేస్తే ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ‘వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.. -
జగనన్న అప్పులు.. జీతాలకు తిప్పలు
[ 11-05-2024]
ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకులకు జీతాల చెల్లింపు బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొంది. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధుల నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. -
సంచిలో నగదు.. యువకుడి నిజాయతీ
[ 11-05-2024]
రహదారి పక్కన సంచిలో కనిపించిన నగదును పోలీసులకు అప్పగించి తద్వారా సంబంధిత వ్యక్తికి అప్పగించి సూరజ్ అనే యువకుడు నిజాయతీని చాటుకున్నాడు. -
ఐసీయూలో సర్కార్ వైద్యం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మాటిచ్చిన ఆయన ఆసుపత్రులు, రోగుల సమస్యలను పట్టించుకోలేదు. -
బోద కనపడదా.. బాధ వినపడదా?
[ 11-05-2024]
జిల్లాలో ఫైలేరియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో బలిజిపేట మండలం పెదపెంకి ఒకటి. వ్యాధి బారిన పడి ఎందరో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు