టోల్ తీస్తారు
విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు.
జొన్నాడ సమీపంలో జరుగుతున్న పనులు
ఈనాడు, విజయనగరం: విజయనగరం జిల్లాలో మూడు ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు త్వరలో ప్రారంభించనున్నారు. వాటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడింటి వల్ల విజయనగరం, మన్యం జిల్లాల సహా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వాహనదారులకు టోల్ రుసుము రూపంలో అధికభారం పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న తరుణంలో వారికి ఈ రూపంలో మరో షాక్ తగలనుంది. జిల్లాలో ఇంతవరకు ఎక్కడా టోల్ ప్లాజాలు లేవు. జాతీయ రహదారి -16పై భోగాపురం- నాతవలస మధ్య కొన్నేళ్లుగా ఒక్కటే కొనసాగుతోంది. తాజాగా మూడు ప్రాంతాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వీటిని సిద్ధం చేస్తోంది.
విజయనగరం శివారులో చెల్లూరు-గొట్లాం మధ్య నిర్మించిన బైపాస్ రోడ్డుపై టోల్ ప్లాజా ఏర్పాటుకు గతంలో అధికారులు ప్రతిపాదించారు. అప్పట్లో కేంద్రంలో కీలక పదవిలో ఉన్న జిల్లా తెదేపా నాయకుడొకరు దాన్ని అడ్డుకున్నారు. జిల్లా సరిహద్దులోని రాజాపులోవ కూడలి - విజయనగరం మార్గంలో ఏర్పాటుకు సైతం ఆయన వ్యతిరేకించారు. నూతన రహదారుల నిర్మాణం తర్వాత టోల్ ప్లాజాలను మాజీ సైనికులకు టెండర్ల ద్వారా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తోంది. వారి పేరిట చేజిక్కించుకోవాలని కొంత మంది బడాబాబులు డేగకళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి వారంతా రింగై టెండర్లు దక్కించుకుంటారు. ఒకరి పేరిట దక్కించుకొని అందరూ భాగస్వాములవుతారు. విజయనగరం బైపాస్ రోడ్డులో ప్లాజా ఏర్పాటు వల్ల పెద్దగా ఆదాయం ఉండదని వారు భావించారు. సరకు రవాణా వాహనాలు తప్ప మిగిలిన అన్ని వాహనాలు విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తాయి. టోల్ప్లాజా ఏర్పాటు స్థలం మారిస్తే వేలాది వాహనాల నుంచి నెలకు రూ.కోట్లలో రుసుము వసూలవుతుందని లెక్కలేశారు. జొన్నాడ సమీపంలో టోల్ప్లాజా ఏర్పాటుకు సహకరించాలని జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేతను వారు సంప్రదించారు. దిల్లీలో పాత పరిచయాలతో ఆ నేత చక్రం తిప్పారు. ఫలితంగా జొన్నాడలో టోల్ప్లాజా ఏర్పాటుకు అధికారులు అంగీకారం తెలిపారని తెలిసింది. ఈ వ్యవహారంలో సదరు నేతకు సుమారు రూ.8 కోట్లు అందినట్లు సమాచారం.
మరో రెండు ఎక్కడంటే..
విజయనగరం - ఎస్.కోట- (వయా బొడ్డవర) జాతీయ రహదారి 516(ఈ)పై గంట్యాడ - కొర్లాం మధ్యలో ఒకటి.. విశాఖపట్నం - రాయపూర్ జాతీయ రహదారి- 26లో మానాపురం రైల్వే గేటు దాటిన తర్వాత మరో ప్లాజా ఏర్పాటుకు నిర్మాణాలు చేపడుతున్నారు. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ప్లాజాలు ఉండకూడదు. ఉంటే ఒక దాన్ని మూసివేయాలి. జొన్నాడ నుంచి మానాపురం వరకు దూరం 60 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఈ రెండు వేర్వేరు రహదారులుగా చూపితే తప్ప ఒకే మార్గంలో ఏర్పాటు చేస్తే చట్టవిరుద్ధమే అవుతుందని.. ఈ కోణంలో వివరాలు సేకరిస్తున్న కొందరు రవాణా రంగ నిపుణులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మానాపురం సమీపంలో టోల్ గేట్ నిర్మించే ప్రదేశం
ప్రయాణికులపై భారమే
రాష్ట్రంలోని రోడ్ల వినియోగానికి ప్రతి వాహనదారుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ చెల్లించాలి. ఇది చెల్లించిన తరువాత వివిధ మార్గాల్లో వాహనం నడపాలంటే టోల్ పన్ను కట్టాలి. టోల్ గేట్ల వద్ద నాలుగు చక్రాల వాహనాల పరిమాణం బట్టి ఏడు రకాలుగా విభజించి రుసుము వసూలు చేస్తారు. ఆర్టీసీ బస్సులు చెల్లించే రుసుమును ప్రభుత్వం ప్రయాణికులపై ఆ భారం మోపుతోంది. ఈ ప్లాజాలు ప్రారంభిస్తే ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల బస్ ఛార్జీలు పెరుగుతాయి. వాహనాల ఫాస్టాగ్లో డబ్బులు లేకపోతే రెట్టింపు రుసుము వసూలు చేస్తారు. ఇలా ఒక్కో ప్లాజాలో నెలకు రూ.కోట్లలోనే వసూలవుతుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాతకు రక్తకన్నీరు!!
[ 11-05-2024]
కాలువలకు సంబంధించి జరిగిన పనులకు గుత్తేదారుకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. రూ.17 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ కారణంగా రబీలో తిరిగి పనులు ప్రారంభించలేదు. వచ్చే నెలతో పనులకు గడువు ముగియనుంది. -
యువ జపం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు చివరి దశకు చేరింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైకాపా, కూటమి పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా దూసుకెళ్తున్నారు. -
నోట్లకట్టలు తెగుతున్నాయ్
[ 11-05-2024]
పోలింగ్కు నాలుగు రోజుల ముందు నుంచి వైకాపా ఓటర్లను ప్రలోభ పెడుతోంది. గురువారం రాత్రి నుంచే పంపకాలు మొదలెట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన మద్యం సీసాలున్న పెట్టెలు విప్పుతున్నారు. -
ప్చ్.. గప్చుప్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 129 మంది పోటీలో ఉన్నారు. -
ప్రజా వైద్యానికి జగన్ వైరస్
[ 11-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజావైద్యానికి వైరస్ సోకింది.. సామాన్యుడికి సుస్తీ చేస్తే ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ‘వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.. -
జగనన్న అప్పులు.. జీతాలకు తిప్పలు
[ 11-05-2024]
ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకులకు జీతాల చెల్లింపు బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొంది. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధుల నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. -
సంచిలో నగదు.. యువకుడి నిజాయతీ
[ 11-05-2024]
రహదారి పక్కన సంచిలో కనిపించిన నగదును పోలీసులకు అప్పగించి తద్వారా సంబంధిత వ్యక్తికి అప్పగించి సూరజ్ అనే యువకుడు నిజాయతీని చాటుకున్నాడు. -
ఐసీయూలో సర్కార్ వైద్యం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మాటిచ్చిన ఆయన ఆసుపత్రులు, రోగుల సమస్యలను పట్టించుకోలేదు. -
బోద కనపడదా.. బాధ వినపడదా?
[ 11-05-2024]
జిల్లాలో ఫైలేరియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో బలిజిపేట మండలం పెదపెంకి ఒకటి. వ్యాధి బారిన పడి ఎందరో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?