జిల్లా ఓటర్లు 7,83,440
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది.
మహిళలే అధికం
జిల్లా కేంద్రంలో తక్కువే
పార్వతీపురం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. జనవరి 22న ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 7,75,598 మంది ఓటర్లుండగా, తుది జాబితాలో ఆ సంఖ్య 7,83,440కి చేరింది. మొత్తం 7,842 మంది పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పురుషులు తక్కువే..
జిల్లాలో ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. పురుషుల కంటే వీరి సంఖ్య 18,190 ఎక్కువగా ఉంది. అత్యధికంగా కురుపాంలో 5,400, పాలకొండలో 5,067, సాలూరులో 4,945, పార్వతీపురంలో 2,778గా ఉన్నారు. అన్ని వర్గాల ఓటర్ల వివరాలకు సంబంధించి సాలూరులో రెండు లక్షలకు పైగా నమోదయ్యారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో మిగిలిన నియోజకవర్గాల కంటే తక్కువగా 1,89,817 మంది ఉన్నారు.
పెరిగిన యువత
తుది జాబితాలో యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో వీరు దాదాపు 22 వేల మంది ఉన్నారు. జనవరిలో ప్రకటించిన జాబితాలో ఈ సంఖ్య కేవలం 13,017. తాజా జాబితాలో 15,568గా నమోదైంది. ఇటీవల 18, 19 ఏళ్ల మధ్యనున్న విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తులు చేసుకోవడంతో వారు పేర్లు జాబితాల్లో చేరాయి. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా అదనంగా 7,842 మంది కొత్తగా చేరారు.
ఎన్ఆర్ఐలు 18 మంది..
ఈసారి విదేశాల్లో ఉన్న భారతీయులకు ఓటుహక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు. జిల్లాలో ప్రవాస భారతీయ ఓటర్లను గుర్తించి ఓటు కల్పించారు. జిల్లాలో 18 మంది ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు ఉంది. వీరిలో 16 మంది పురుషులు, ఇద్దరు మహిళలు. వీరితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న 2,235 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,123 మంది, మహిళలు 112 మందిగా నమోదయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాతకు రక్తకన్నీరు!!
[ 11-05-2024]
కాలువలకు సంబంధించి జరిగిన పనులకు గుత్తేదారుకు బిల్లులు బకాయిలు ఉన్నాయి. రూ.17 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ కారణంగా రబీలో తిరిగి పనులు ప్రారంభించలేదు. వచ్చే నెలతో పనులకు గడువు ముగియనుంది. -
యువ జపం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు చివరి దశకు చేరింది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైకాపా, కూటమి పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా దూసుకెళ్తున్నారు. -
నోట్లకట్టలు తెగుతున్నాయ్
[ 11-05-2024]
పోలింగ్కు నాలుగు రోజుల ముందు నుంచి వైకాపా ఓటర్లను ప్రలోభ పెడుతోంది. గురువారం రాత్రి నుంచే పంపకాలు మొదలెట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన మద్యం సీసాలున్న పెట్టెలు విప్పుతున్నారు. -
ప్చ్.. గప్చుప్
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 129 మంది పోటీలో ఉన్నారు. -
ప్రజా వైద్యానికి జగన్ వైరస్
[ 11-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజావైద్యానికి వైరస్ సోకింది.. సామాన్యుడికి సుస్తీ చేస్తే ప్రభుత్వ దవాఖానాల్లో సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ‘వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం.. -
జగనన్న అప్పులు.. జీతాలకు తిప్పలు
[ 11-05-2024]
ఉపాధి హామీ పథకం సాంకేతిక సహాయకులకు జీతాల చెల్లింపు బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొంది. స్థానికంగా అందుబాటులో ఉన్న నిధుల నుంచే చెల్లించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం స్పష్టం చేసింది. -
సంచిలో నగదు.. యువకుడి నిజాయతీ
[ 11-05-2024]
రహదారి పక్కన సంచిలో కనిపించిన నగదును పోలీసులకు అప్పగించి తద్వారా సంబంధిత వ్యక్తికి అప్పగించి సూరజ్ అనే యువకుడు నిజాయతీని చాటుకున్నాడు. -
ఐసీయూలో సర్కార్ వైద్యం
[ 11-05-2024]
ముఖ్యమంత్రి జగన్ అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని మాటిచ్చిన ఆయన ఆసుపత్రులు, రోగుల సమస్యలను పట్టించుకోలేదు. -
బోద కనపడదా.. బాధ వినపడదా?
[ 11-05-2024]
జిల్లాలో ఫైలేరియా వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో బలిజిపేట మండలం పెదపెంకి ఒకటి. వ్యాధి బారిన పడి ఎందరో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు.