చంద్రబాబుతోనే సంక్షేమం
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
సతివాడలో అభిమానులు అందజేసిన కేకు కోస్తున్న బేబినాయన, తెంటు
బొబ్బిలి, తెర్లాం, మెంటాడ(గజపతినగరం), న్యూస్టుడే: రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బొబ్బిలి పట్టణంలోని స్వామివారివీధిలో, తెర్లాం మండలం సతివాడ, ఉద్దవోలు, సుందరాడ, నెమలాం గ్రామాల్లో బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ప్రచారం చేశారు. గిరడ అప్పలస్వామి, వెంకటినాయుడు, వెంకటేశ్వరరావు, మర్రాపు యుగంధర్, రెడ్డి సత్యం తదితరులు పాల్గొన్నారు. ముత్తాయివలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచి బొద్దల ఈశ్వరరావు, పిల్లా శ్రీరాములు, జమ్ము నాగభూషణ్, జమ్ము రామారావు తదితరులు కోటలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మెంటాడ మండలం బడేవలస, చల్లపేట గ్రామాల్లో కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యరాణి పర్యటించి, ‘సూపర్-6’ పథకాలను వివరించారు. వెంకటరావు, అన్నవరం తదితరులు పాల్గొన్నారు.
మెంటాడలో సంధ్యారాణి ప్రచారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకిస్తామన్న డబ్బులు ఏమయ్యాయి
[ 14-05-2024]
ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామన్నారని, చాలామందికి ఇవ్వలేదంటూ కొత్తవలస మండలం వీరభద్రపురంలోని దాసరిపేటకు చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును సోమవారం రాత్రి నిలదీశారు. -
స్ఫూర్తి చాటిన ఓటర్లు
[ 14-05-2024]
వయోభారం.. అనారోగ్యం.. వర్షం.. విద్యుత్తు లేకపోవడం వంటి ఇబ్బందులున్నా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్ఫూర్తి చాటారు. -
ఒక్క ఓటు.. గంటన్నర ఉద్రిక్తత
[ 14-05-2024]
పాలకొండ పట్టణంలోని పెదకాపువీధి ప్రాథమిక పాఠశాలలో నం.177 పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు కోసం గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
వర్షమొచ్చినా.. చీకటైనా ఓటింగ్
[ 14-05-2024]
శృంగవరపుకోట నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల పోలింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
వైకాపా శ్రేణుల వీరంగం
[ 14-05-2024]
పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య గొడవ తోపులాటకు దారితీసింది. -
తెదేపా ఏజెంటుపై దాడి
[ 14-05-2024]
బొబ్బిలి మండలంలోని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడి స్వగ్రామం పక్కిలో తెదేపా పోలింగ్ ఏజెంటు రెడ్డి బాబురావుపై వైకాపా కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. బాధితుడి వివరాల మేరకు.. -
ఎన్నికల్ని బహిష్కరించిన భోజరాజపురం
[ 14-05-2024]
దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీ పరిధిలోని భోజరాజపురం గ్రామస్థులు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు. గ్రామంలోని ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. -
తరలివచ్చారు.. బస్సుల్లేక ఇరుక్కుపోయారు
[ 14-05-2024]
ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వారికి చిక్కులు తప్పలేదు. విజయనగరం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి చాలామంది ఆదివారం అర్ధరాత్రి విజయనగరంలోని కాంప్లెక్స్కు చేరుకున్నారు.