logo

చంద్రబాబుతోనే సంక్షేమం

రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

Published : 29 Apr 2024 05:05 IST

సతివాడలో అభిమానులు అందజేసిన కేకు కోస్తున్న బేబినాయన, తెంటు

బొబ్బిలి, తెర్లాం, మెంటాడ(గజపతినగరం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బొబ్బిలి పట్టణంలోని స్వామివారివీధిలో, తెర్లాం మండలం సతివాడ, ఉద్దవోలు, సుందరాడ, నెమలాం గ్రామాల్లో బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ప్రచారం చేశారు. గిరడ అప్పలస్వామి, వెంకటినాయుడు, వెంకటేశ్వరరావు, మర్రాపు యుగంధర్‌, రెడ్డి సత్యం తదితరులు పాల్గొన్నారు. ముత్తాయివలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచి బొద్దల ఈశ్వరరావు, పిల్లా శ్రీరాములు, జమ్ము నాగభూషణ్‌, జమ్ము రామారావు తదితరులు కోటలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మెంటాడ మండలం బడేవలస, చల్లపేట గ్రామాల్లో కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యరాణి పర్యటించి, ‘సూపర్‌-6’ పథకాలను వివరించారు. వెంకటరావు, అన్నవరం తదితరులు పాల్గొన్నారు.

మెంటాడలో సంధ్యారాణి ప్రచారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని