కంకర గుటకాయ స్వాహా
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి.
న్యూస్టుడే, గరివిడి, గంట్యాడ గ్రామీణం, మెంటాడ, గజపతినగరం, బాడంగి
గుర్ల మండలం పోలాయవలసలో కొండను తవ్వేసిన దృశ్యం
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. వైకాపా పెద్దల అండతో అడ్డూ అదుపూ లేకుండా గుట్టల్ని మాయం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడాలేకుండా యథేచ్ఛగా ఈ తతంగం సాగిపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
రూ.లక్షల్లో వ్యాపారం
గరివిడి, చీపురుపల్లి పట్టణాల పరిధిలో ఎక్కడ లేఅవుట్ వేసినా భూముల చదునుకు అవసరమైన ఎర్రమట్టి కోసం కొండల్ని తవ్వేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించుకుపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. గుర్లలో కొన్ని చోట్ల తవ్వకాల అనంతరం ఆ భూములను చదును చేసి జీడి, మామిడి తోటల సాగుకు అనువుగా సిద్ధం చేసుకుని ఆక్రమించేస్తున్నారు. చెరువులు, కాలువ కట్టలనూ వదల్లేదు. ఇటుకల పరిశ్రమల్లో ఇటుకలు తయారీకి అవసరమైన మట్టిని చెరువు గర్భాల్లో ఇష్టానుసారం తవ్వేశారు. వెదుళ్లవలస, కోనూరు, కోటగండ్రేడు, పెదబంటుపల్లి, చుక్కవలస తదితర గ్రామాల్లో చెరువుల మట్టిని దోపిడీ చేశారు. గరివిడి, చీపురుపల్లి మండలాల్లో తోటపల్లి కుడి కాలువ కట్టలను మట్టి కోసం ఎక్కడికక్కడే తవ్వేస్తున్నారు. గజపతినగరం, మెంటాడ, గంట్యాడలోని అనేక కొండల్ని అక్రమార్కులు కరిగించేస్తున్నారు.
బాడంగి మండలంలో కంకర అక్రమ తవ్వకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బందలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. రామచంద్రపురం సమీపంలోని చెరువునూ తవ్వేస్తున్నారు.
ఇది మెంటాడ సమీప కొండ. చుట్టూ ఇలా కంకర తవ్వారు. తవ్వకాలకు అనుమతులు ఒకచోట పొంది వేరొక చోట మట్టిని తీసి, దిగువన ఉన్న రైతుల పొలాలను ధ్వంసం చేశారు. గుత్తేదారులకు అప్పగించి, నేతలు కాసులు దండుకున్నారు. జయతి ప్రాంతంలో డి.పట్టా రైతుల భూముల్లో తవ్వకాలు జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుదెరువుకు వెళ్లాం.. భవిత మార్చేందుకు వచ్చాం
[ 13-05-2024]
ఎక్కడెక్కడికో వెళ్లి ప్రైవేటు ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న వారు ఎన్నడూ లేని విధంగా స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. -
ఓ నిర్ణేతా.. మార్చుకో నీ తలరాత..!
[ 13-05-2024]
ప్రత్యేక శ్రద్ధ చూపాయి. సాగుకు ఆర్థిక చేయూత, బ్యాంకు రుణాలు, రుణాలపై వడ్డీ రాయితీ, పండించే పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ.. సాగులో ముందడుగేయాలంటే ఇవన్నీ కీలకమే. -
వారి స్ఫూర్తి వీరికెక్కడిది
[ 13-05-2024]
పార్లమెంట్ నిధులు (ఎంపీ ల్యాడ్స్) వినియోగంలో ఉమ్మడి జిల్లాలో వైకాపా ఎంపీల అలసత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. -
గుప్పుమంటున్న గంజాయి!
[ 13-05-2024]
విజయనగరంలోని వైఎస్సార్ నగర్ సమీపంలో నెల రోజుల కిందట గంజాయి మత్తులో కొంతమంది యువకులు రైల్వే కూలీలను కొట్టారు. -
మీ విజయం కాంక్షిస్తున్నా
[ 13-05-2024]
విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు విజయాన్ని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. -
అసౌకర్యాలతో సిబ్బందికి అవస్థలు
[ 13-05-2024]
బొబ్బిలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పంపిణీ కేంద్రంలో అసౌకర్యాల తో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. -
మహిళలకు ప్రత్యేక కేంద్రం..
[ 13-05-2024]
చీపురుపల్లి మండలం మెట్టపల్లి పోలింగ్ కేంద్రం 165 ప్రత్యేకతను చాటింది. ఈసీ ఆదేశాల మేరకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న మెట్టపల్లిలో మహిళా ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. -
అర్ధరాత్రి దాటాక ఆయువు తీశారు!
[ 13-05-2024]
ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న విశ్రాంత ఉద్యోగి, తెదేపా సానుభూతిపరుడి హత్య రేగిడి మండలంలోని చినశిర్లాంలో కలకలం రేపింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 13-05-2024]
ద్విచక్రవాహనం ఫ్లైఓవర్ పైనుంచి కింద పడటంతో జామి మండలానికి చెందిన యువకుడు దుర్మరణం పాలైన ఘటన విశాఖపట్నంలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్