చికిత్స పొందుతూ వివాహిత మృతి
మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది.
చందక పుష్ప
(పాతచిత్రం)
భోగాపురం, న్యూస్టుడే: మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కిలారి శ్రీనుతో పుష్పకు వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం పెద్దల సమక్షంలో విడిపోయారు. తల్లి ముత్యాలమ్మ కుమార్తెకు భర్తతోనే జీవితం కొనసాగించాలని నచ్చజెప్పింది. తనకు ఇష్టం లేని వ్యక్తితో ఉండకూడదని 23న ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ముత్యాలమ్మకు ఇటు కుమార్తె కూడా దూరమవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
అజయ్ (పాత చిత్రం)
మండవల్లి, సాలూరు గ్రామీణం, న్యూస్టుడే: పొట్టచేత పట్టుకుని జిల్లాలు దాటి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలం దెయ్యంపాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సాలూరు మండలం కోట్లుపరుగు గ్రామానికి చెందిన చింతాడ అజయ్(29) చేపల చెరువుపై కూలీ పనుల నిమిత్తం కొంతకాలం క్రితం ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలం యాగనమిల్లు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కైకలూరులో కూరగాయలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై యాగనమిల్లు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండవల్లి మండలం దెయ్యంపాడు వద్దకు వచ్చేసరికి ఏలూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు. మృతుడి తండ్రి ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలే బంగారు గొలుసు చోరీ
వంగర, న్యూస్టుడే: వంగర మండలం మగ్గూరు, మడ్డువలస గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డారు. మగ్గూరు గ్రామానికి చెందిన చింత అమ్మడమ్మ పశువులను మేపుతుండగా రహదారిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ విషయంపై వంగర పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.వి.జనార్దన్ తెలిపారు.
చెక్పోస్టు వద్ద నగదు స్వాధీనం
వంగర, న్యూస్టుడే: మండలంలోని బంగారువలస వద్ద ఏర్పాటు చేసిన అంతర జిల్లాల చెక్పోస్టు వద్ద ఎస్.ఎస్.టి. బృందం చేపట్టిన తనిఖీల్లో సోమవారం రూ.2,59,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వై.వి.జనార్దన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ నిర్మూలనపై అవగాహన ర్యాలీ
[ 16-05-2024]
జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గురువారం డెంగీ నిర్మూలనపై అవగాహన ర్యాలీ చేశారు. -
రైతులకు దూరం.. సేవలకు రాంరాం
[ 16-05-2024]
రైతుల కోసం... వారి ప్రయోజనం కోసం ఉద్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉనికిని కోల్పోతున్నాయి. గతంలో పలు రకాల సేవలందించినా.. నేడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
130 స్థానాలకు పైగా విజయం సాధిస్తాం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 130కి పైగా స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు -
ఓటరు మారాజులు 17,35,958
[ 16-05-2024]
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 11 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 106 మంది అభ్యర్థులు నిలిచారు. -
శ్రమ ఎక్కువ.. పారితోషికం తక్కువ
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రెమ్యూనరేషన్ (పారితోషికం), టీఏ/డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని రెండు జిల్లాల సిబ్బంది ఆరోపించారు. -
ఇంజినీరింగ్కే మొగ్గు
[ 16-05-2024]
నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆన్లైన్ విధానంలో ఎనిమిది రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రోజుకు రెండు షిప్టులుగా పరీక్షలు జరుగుతాయి. -
ఇంటర్మీడియట్లో ప్రవేశాలు ప్రారంభం
[ 16-05-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు బుధవారం నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం.ఆదినారాయణ తెలిపారు. -
జేఎన్టీయూలో ఈవీఎంల భద్రత
[ 16-05-2024]
ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్రూంలో భద్రపర్చే చర్యలు తీసుకున్నారు. -
అమ్మకు నిస్సత్తువ..!
[ 16-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు గత కొన్నేళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
ఇంతులు..చైతన్య కాంతులు
[ 16-05-2024]
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మొత్తం 15,62,921 మందిలో 7,92,038 మంది వీరే ఉన్నారు. -
జాతీయ భాగ్యం.. పాలకుల నిర్లక్ష్యం
[ 16-05-2024]
జిల్లాలతో పాటు పక్కనున్న ఒడిశా రాష్ట్రాన్ని కలిపే కీలక మార్గం. నిత్యం వాహనాల రద్దీ ఎక్కువ. సరకులు, ఇతరత్రా ఉత్పత్తుల రవాణా లారీలు, ప్రయాణికుల బస్సులు, ఇతర వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తుంటాయి -
అంబులెన్స్ల నిర్వహణ గాలికి
[ 16-05-2024]
పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రికి రోజుకు 550 నుంచి 600 మధ్య ఓపీ ఉంటుంది. 150 పడకల ఆసుపత్రిలో 200 మంది వరకు ఇన్పేషెంట్లు ఉంటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర