logo

రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌గా ప్రకాష్‌బాబు

రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లా ఛైర్మన్‌గా పి.ప్రకాష్‌బాబు మరోసారి ఎన్నికయ్యారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు.

Published : 26 Mar 2023 02:16 IST

రెడ్‌క్రాస్‌ సంస్థ నూతన కార్యవర్గ సభ్యులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రెడ్‌క్రాస్‌ సంస్థ జిల్లా ఛైర్మన్‌గా పి.ప్రకాష్‌బాబు మరోసారి ఎన్నికయ్యారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. వైస్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారిగా డీవీ రాఘవ, మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా... మంగళగిరి నరసింహారావు, మన్నం ప్రసన్నరాజు, బీవీ రెడ్డి, పబ్బిశెట్టి జనార్దన్‌, డాక్టర్‌ రావిపాటి జయశేఖర్‌, శ్రీనివాసరావు, వెన్నపూస శ్రీరాములురెడ్డి, న్యామతుల్లాబాషా, కోడూరి వెంకట్రావు, డాక్టర్‌ కనకదుర్గ (మార్కాపురం), సోమిశెట్టి శ్రీనివాసులు (కనిగిరి) ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌లుగా సయ్యద్‌ ఇక్బాల్‌, బెజవాడ పవన్‌, కత్తి శ్రీనివాసరావు, రమణ, శ్రీహరి, మారెళ్ల సుబ్బారావును ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా మెప్మా పీడీ రవికుమార్‌ వ్యవహరించారు. ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా డీఆర్‌డీఏ పీడీ బాబూరావు, రాష్ట్ర పరిశీలకులుగా కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రమేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ ప్రకాష్‌బాబును సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని