వైకాపా ప్రచారంలో ఉద్యోగులు
గత మంగళవారం దర్శి మండలం చందలూరులో అధికార వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ చవలం రామాంజనేయులు, వాలంటీరు సింగంశెట్టి సతీష్లు పాల్గొన్నారు.
బూచేపల్లి ప్రచారంలో ఎఫ్ఏ రామాంజనేయలు, వాలంటీర్ సతీష్
తాళ్లూరు, దర్శి, న్యూస్టుడే : గత మంగళవారం దర్శి మండలం చందలూరులో అధికార వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ చవలం రామాంజనేయులు, వాలంటీరు సింగంశెట్టి సతీష్లు పాల్గొన్నారు. ఈ విషయమై శనివారం తెదేపా నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు: కొండపి గ్రామీణం: భవనగిరి వెంకట సుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు వైకాపాకు ఊడిగం చేస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని పెదకండ్లగుంట గ్రామస్థులు కొండపి ఏఆర్వో కిరణ్కుమార్కు ఫిర్యాదు చేశారు. 26న ‘ఈనాడు’లో వచ్చిన ‘నీకెందుకింత గులాంగిరీ’ వార్త ముమ్మాటికీ వాస్తవమన్నారు. పాఠశాలకు వెళ్లకుండా సంతకాలు పెట్టి, వైకాపా నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన బ్యాలెట్ ఓట్లు కూడా సేకరిస్తున్నారని ఆరోపించారు.ఆర్వో అరవ కుమార్ లేకపోవడంతో ఏఆర్వోకు అర్జీ అందజేశారు. మాజీ సర్పంచి తానికొండ వెంకటేశ్వర్లు, కొల్లా మోహన్, కొల్లా రామకోటు, తానికొండ సంగమేశ్వరరావు, కొల్లా లక్ష్మీనారాయణ, తలమంచి మాల్యాద్రి, కాకర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయం మనదే.. జన దీవెన మనకే
[ 11-05-2024]
‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులు ఎంతో చొరవ చూపారు. డిమాండ్ చేసి.. క్యూలో నిల్చుని మరీ ఓట్లేశారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మేమందరం మీకే ఓటేశాం అని చెవిలో చెబుతుంటే ఎంతో సంతోషం వేసింది. -
నిధులు మళ్లించి.. నిలువునా ముంచి
[ 11-05-2024]
ఎన్నికల ముందు అన్నా.. అంటూ ఎక్కడ లేని అనురాగం..ఆప్యాయతలు ఒలకబోశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చాకిరీ చేయిస్తోందంటూ అబద్ధాల్ని ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలన్నీ తీరుస్తానని మాయమాటలు చెప్పారు. -
తొత్తులు..ఎన్నికలకు హానికారులు
[ 11-05-2024]
ఎన్నికల్లో పోలీసు శాఖది అత్యంత కీలకపాత్ర. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఆ శాఖదే. కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్య, పక్షపాత వైఖరులు ఇందుకు గండి కొడుతున్నాయి. -
మద్యం సీసా రూ.10 బియ్యం బస్తా రూ.50
[ 11-05-2024]
రూ.పది నోటు ఇస్తే మూడు మద్యం క్వార్టర్ సీసాలు.. రూ. 50 నోటు అందిస్తే బియ్యం బస్తా.. ఇవేవో దుకాణాలు ప్రకటించిన ఆఫర్లు.. తగ్గిన ధరల పుణ్యమో అనుకుంటే పొరపాటు. తన విధానాలతో అయిదేళ్లపాటు ధరలు పెంచి జనాన్ని వైకాపా ప్రభుత్వం కాల్చుకు తింది. ఎన్నికల వేళ అదే పార్టీ నేతలు.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పన్నిన పన్నాగమిది. -
ఊళ్లు కాదు.. జాగాల విక్రయాలు
[ 11-05-2024]
-
సార్వత్రిక రణం.. ఇదేం సన్నద్ధం!
[ 11-05-2024]
కలెక్టర్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో బీఎల్వో వరకు అందరూ సమష్టిగా పనిచేస్తేనే అయిదేళ్లకోసారి సాగే క్రియాశీలకమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుంది. అందుకు ఎన్నికలకు రెండు, మూడు నెలల నుంచి పూర్తి సన్నద్ధత అవసరం. -
ఏర్పాట్లలో లోపాలకు ఆస్కారమివ్వొద్దు
[ 11-05-2024]
పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల్లో పనిచేసే అధికారులు ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. -
సమైక్య కృషితో తెదేపా విజయ దుందుభి
[ 11-05-2024]
అందరం కలసికట్టుగా పనిచేద్దాం.. తెదేపా విజయ దుందుభి మోగించేలా కృషి చేద్దామని ఒంగోలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. -
క్రైస్తవ సోదరుల్ని మోసం చేసేందుకు జగన్ సిద్ధం
[ 11-05-2024]
మళ్లీ క్రైస్తవ సోదరుల్ని మోసం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు సిద్ధమయ్యారని తెదేపా క్రైస్తవ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు విమర్శించారు. -
ట్రాక్టర్ కింద పడి మహిళ దుర్మరణం
[ 11-05-2024]
చోదకుడి నిర్లక్ష్యం.. ఓ మహిళా కూలీ ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన మండలంలోని బొద్దికూరపాడు వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. -
కారు- బైక్ ఢీకొని...
[ 11-05-2024]
కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన దర్శి-పొదలి ఆర్అండ్బి రహదారి రాజంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
ఉపాధి పోగొట్టి ఓటు వేయమంటారా!
[ 11-05-2024]
తనకు ఉపాధి పోగొట్టి, ఇప్పుడు ఓటేయమంటారా అంటూ ఓ దళిత మహిళ వైకాపా నేతలను నిలదీసిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని రామాపురం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఆమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా పనిచేసేది.