క్వార్టర్ మద్యం కోసం మట్టుబెట్టాడు
క్వార్టర్ మద్యం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన యర్రగొండపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసులు ఛేదించారు.
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్టుడే : క్వార్టర్ మద్యం కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన యర్రగొండపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. 24 గంటల్లో పోలీసులు ఈ కేసులు ఛేదించారు. శనివారం రాత్రి విలేకరుల సమావేశంలో సీఐ రాములు నాయక్ హత్య వివరాలను వెల్లడించారు. యర్రగొండపాలెం పట్టణానికి చెందిన యలగాల శ్రీనివాసులు (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో దర్యాప్తు చేపట్టి హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఆధారంగా ముద్దాయిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు పట్టణంలోని చెంచుపాముల కాలనీకి చెందిన ఓరుగంటి రాజేష్ కొలిమి పనిచేస్తుంటాడని, వ్యసనాలకు లోనై నిత్యం మద్యం తాగుతుంటాడని పేర్కొన్నారు. ఇటీవల మద్యం తాగే సమయంలో శ్రీనివాసులతో పరిచయమై ఇద్దరూ స్నేహితులుగా మారారు. గురువారం సాయంత్రం వినుకొండ రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వీరిద్దరూ చెరో మూడు మద్యం బాటిళ్ల కొనుగోలు చేశారు. రాజేష్ కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లలో రెండు అమ్మేశాడు. ఒకటి తాగేశాడు. శ్రీనివాసులు తాను కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లలో ఒక బాటిళ్లను తాగేసి రెండు తన ప్యాంటు జేబులో ఉంచుకున్నాడు. ఇది గమనించిన రాజేష్ శ్రీనివాసులను నీ దగ్గర ఉన్న రెండు బాటిళ్లలో ఒకటి తనకు ఇవ్వమని అడిగాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అనంతరం శ్రీనివాసులు స్థానిక ఒక ప్రైవేటు వైద్యశాల వెనకాల కొత్తగా నిర్మించే భవనంలోకి వెళ్లి పడుకున్నాడు. తనకు మద్యం బాటిల్ ఇవ్వలేదని అక్కసుతో శ్రీనివాసులపై పగ పట్టిన రాజేష్ ఇంటికి వెళ్లి ఒక ఇనుప రాడ్డును తీసుకొచ్చి పడుకుని ఉన్న శ్రీనివాసుల ముఖం మీద కసితీరా కొట్టాడు. అతను కొన ఊపిరితో దాహం అని అరిచినా పట్టించుకోకుండా చంపి అక్కడ నుంచి పారిపోయాడు. శ్రీనివాసుల సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు హత్య జరిగిన ప్రదేశంలో వైద్యశాలకు చెందిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాజేష్ను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ రాములునాయక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయం మనదే.. జన దీవెన మనకే
[ 11-05-2024]
‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులు ఎంతో చొరవ చూపారు. డిమాండ్ చేసి.. క్యూలో నిల్చుని మరీ ఓట్లేశారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మేమందరం మీకే ఓటేశాం అని చెవిలో చెబుతుంటే ఎంతో సంతోషం వేసింది. -
నిధులు మళ్లించి.. నిలువునా ముంచి
[ 11-05-2024]
ఎన్నికల ముందు అన్నా.. అంటూ ఎక్కడ లేని అనురాగం..ఆప్యాయతలు ఒలకబోశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చాకిరీ చేయిస్తోందంటూ అబద్ధాల్ని ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలన్నీ తీరుస్తానని మాయమాటలు చెప్పారు. -
తొత్తులు..ఎన్నికలకు హానికారులు
[ 11-05-2024]
ఎన్నికల్లో పోలీసు శాఖది అత్యంత కీలకపాత్ర. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఆ శాఖదే. కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్య, పక్షపాత వైఖరులు ఇందుకు గండి కొడుతున్నాయి. -
మద్యం సీసా రూ.10 బియ్యం బస్తా రూ.50
[ 11-05-2024]
రూ.పది నోటు ఇస్తే మూడు మద్యం క్వార్టర్ సీసాలు.. రూ. 50 నోటు అందిస్తే బియ్యం బస్తా.. ఇవేవో దుకాణాలు ప్రకటించిన ఆఫర్లు.. తగ్గిన ధరల పుణ్యమో అనుకుంటే పొరపాటు. తన విధానాలతో అయిదేళ్లపాటు ధరలు పెంచి జనాన్ని వైకాపా ప్రభుత్వం కాల్చుకు తింది. ఎన్నికల వేళ అదే పార్టీ నేతలు.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పన్నిన పన్నాగమిది. -
ఊళ్లు కాదు.. జాగాల విక్రయాలు
[ 11-05-2024]
-
సార్వత్రిక రణం.. ఇదేం సన్నద్ధం!
[ 11-05-2024]
కలెక్టర్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో బీఎల్వో వరకు అందరూ సమష్టిగా పనిచేస్తేనే అయిదేళ్లకోసారి సాగే క్రియాశీలకమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుంది. అందుకు ఎన్నికలకు రెండు, మూడు నెలల నుంచి పూర్తి సన్నద్ధత అవసరం. -
ఏర్పాట్లలో లోపాలకు ఆస్కారమివ్వొద్దు
[ 11-05-2024]
పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల్లో పనిచేసే అధికారులు ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. -
సమైక్య కృషితో తెదేపా విజయ దుందుభి
[ 11-05-2024]
అందరం కలసికట్టుగా పనిచేద్దాం.. తెదేపా విజయ దుందుభి మోగించేలా కృషి చేద్దామని ఒంగోలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. -
క్రైస్తవ సోదరుల్ని మోసం చేసేందుకు జగన్ సిద్ధం
[ 11-05-2024]
మళ్లీ క్రైస్తవ సోదరుల్ని మోసం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు సిద్ధమయ్యారని తెదేపా క్రైస్తవ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు విమర్శించారు. -
ట్రాక్టర్ కింద పడి మహిళ దుర్మరణం
[ 11-05-2024]
చోదకుడి నిర్లక్ష్యం.. ఓ మహిళా కూలీ ప్రాణాలు బలిగొంది. ఈ సంఘటన మండలంలోని బొద్దికూరపాడు వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. -
కారు- బైక్ ఢీకొని...
[ 11-05-2024]
కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన దర్శి-పొదలి ఆర్అండ్బి రహదారి రాజంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
ఉపాధి పోగొట్టి ఓటు వేయమంటారా!
[ 11-05-2024]
తనకు ఉపాధి పోగొట్టి, ఇప్పుడు ఓటేయమంటారా అంటూ ఓ దళిత మహిళ వైకాపా నేతలను నిలదీసిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని రామాపురం ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఆమె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా పనిచేసేది.
తాజా వార్తలు (Latest News)
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు