వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.
\
గిద్దలూరు : రజకసంఘం నాయకులతోఅశోక్రెడ్డి , తెదేపా నాయకులు
గిద్దలూరు పట్టణం, కంభం, కంభం(రాచర్ల) : బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం గిద్దలూరులో రజక సంఘీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
- గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో అశోక్రెడ్డి సతీమణి పుష్పలీల ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
- కంభం పట్టణంలోని ఓ అపార్టుమెంట్ వద్ద అశోక్రెడ్డి సమక్షంలో నర్సిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాల వారు తెదేపాలో చేరారు. పట్టణంలో అశోక్రెడ్డి సోదరుడు జగన్నాథ్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- రాచర్ల మండలం సత్యవోలు, రంగారెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్డీఏ అభ్యర్థి అశోక్రెడ్డి సోదరి గీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పొదిలిలో ఓటు అభ్యర్థిస్తున్న నారాయణరెడ్డి చెల్లెలు లక్ష్మి
తర్లుపాడు, పొదిలి గ్రామీణం, మార్కాపురం పట్టణం, పొదిలి : తర్లుపాడు మండలంలోని మీర్జాపేట, చెన్నారెడ్డిపల్లె, నాగెళ్లముడుపు తదితర గ్రామాల్లో ఆదివారం ప్రచారరథంపై కందుల నారాయణరెడ్డి మూడోరోజు యాత్ర కొనసాగించారు. పొదిలి మండలంలోని కంభాలపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులు పది కుటుంబాలు ఆదివారం మార్కాపురం తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యలో పార్టీలో చేరారు.
- మార్కాపురం పట్టణంలో కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మీ ప్రచారం చేశారు.
- నారాయణరెడ్డి చెల్లెలు కందుల లక్ష్మి, తెదేపా నాయకులతో కలిసి పొదిలి పాతూరులో ప్రచారం నిర్వహించారు.
పెద్దారవీడు,యర్రగొండపాలెం పట్టణం: పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి, కొండారెడ్డి కాలనీ, కర్రోల, వైడీపాడులో ఆదివారం వైపాలెం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు ప్రచారం నిర్వహించారు. యర్రగొండపాలెం పట్టణంలో తెదేపా తరుపున ఎరిక్షన్బాబు కుమారుడు, కుమార్తె అజిత్, చెల్సియాలు ఆదివారం తన తండ్రి కోసం విస్త్రత ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
కంభం (రాచర్ల), న్యూస్టుడే : రాచర్ల మండలం అనుమలవీడు, పాలకవీడు, సోమిదేవిపల్లి, గుడిమెట్ట, అంకిరెడ్డిపల్లి, యడవల్లి, సత్యవోలు, తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల పెద్ద రంగస్వామి ఆదివారం ప్రచారం నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్ని పరీక్ష దాటి.. నిశిరాత్రీ నిలిచి.. సార్వత్రిక సమరంలో సర్వత్రా చైతన్యం
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. -
కర్రపెత్తనం రాతియుగ మనస్తత్వం
[ 14-05-2024]
దాష్టీకాలే ఊపిరిగా గెలుపు కోసం మళ్లీ కుటిల వ్యూహాలనే నమ్ముకున్నారు వైకాపా నేతలు. -
ఓటరు గర్జించే.. భానుడు తలవంచె
[ 14-05-2024]
ఎన్నాళ్లో వేచిన.. ఉదయం రానే వచ్చింది. పోలింగ్ పర్వదినమైన సోమవారం నాడు భానుడు చండ ప్రచండంగా చెలరేగిపోయినా.. ఈదురు గాలులతో వరుణుడు బీభత్సం సృష్టించినా.. వజ్రాయుధం ధరించిన ఓటర్ ఒక్క అడుగూ వెనక్కువేయలేదు. -
దర్శిలో ఉద్రిక్తత
[ 14-05-2024]
పోలింగ్ చివరి దశలో సోమవారం సాయంత్రం దర్శిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. -
వసతుల్లేక.. అవస్థ
[ 14-05-2024]
నేతల తలరాతలు మార్చే కీలకమైన ఎన్నికల నిర్వహణలో యంత్రాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. -
విస్తృత ఏర్పాట్లతో భారీ పోలింగ్: కలెక్టర్
[ 14-05-2024]
జిల్లావ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టడంతో భారీగా పోలింగ్ నమోదైందని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. -
కదన రంగంలో కూటమి
[ 14-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
-
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
-
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
-
ఓట్ల పండుగకు 42 బస్సుల్లో వచ్చిన యువత
-
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి