logo

తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు.

Published : 03 May 2024 03:16 IST

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తిమ్మాపురం వాలంటీర్లు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. వాలంటీర్లు మర్రి మల్లికార్జున, మీనిగె మనోహర్‌, గద్దల రంగస్వామి, సప్పరపు వెంకటరమణ, బాసికం వెంకటసుబ్బయ్యలు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు తెదేపా నియోజకవర్గ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి అశోక్‌రెడ్డి తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని