అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు.
మామిడిపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష
పలాస గ్రామీణం, న్యూస్టుడే: పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. తెదేపా పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష, ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణతో కలిసి ఎంపీ రామ్మోహన్నాయుడు శనివారం ప్రచారం నిర్వహించారు. పలాస మండలం మామిడిపల్లి, బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, కొబ్బరిచెట్లూరు, సున్నాదేవి, లొద్దభద్ర, రెంటికోట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు తన అధికారాన్ని పలాస అభివృద్ధి కోసం వినియోగించకుండా కొండలు దోచుకోవడానికే ఉపయోగించారని, అందుకే ఆయన కొండలరాజుగా ప్రసిద్ధి చెందారని ఎద్దేవా చేశారు. జగన్ సీఎం కావడంతో ఆడపడుచులు, రైతులు, యువకులకు నష్టం జరిగిందని, ఈసారి ఆ పొరపాటు చేయొద్దని కోరారు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా.. చంద్రబాబును సీఎం చేయాలని కోరారు. గౌతు శిరీష మాట్లాడుతూ.. మోసం, దగా, కుట్ర, అబద్ధాలు తప్ప ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం చేయలేని వైకాపాకు మరో అవకాశం ఇవ్వొద్దని కోరారు. కార్యక్రమంలో వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్, దువ్వాడ హేంబాబు చౌదరి, కిక్కర డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతిలో అధికారం.. చేసేదంతా అ‘ధర్మం’..!
[ 11-05-2024]
ఆయనో రాజకీయ దురంధరుడు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్నని, తన మాటలతో ఎంతటి వారినైనా అలవోకగా నమ్మించేస్తారు. -
ఉద్యోగాలేవీ.. ఉపాధి ఉసేది జగన్?
[ 11-05-2024]
గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు.. స్థానిక ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకేనని డప్పుకొట్టారు.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన.. ఇలా.. యువతకు చెప్పనిది లేదు. -
పర్యాటకాన్ని మడతపెట్టేశారు..!
[ 11-05-2024]
జిల్లాలో సహజసిద్ధ పర్యాటక సొబగులు ఎన్నో ఉన్నాయి.. వాటిని పర్యాటకులకు అనుకూలంగా అభివృద్ధి చేస్తే జిల్లాలో ఈ రంగానికి ఎంతో ఆదరణ లభిస్తుంది. -
పేరుతో కిరణం.. ప్రగతిలో అంధకారం..!
[ 11-05-2024]
గత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హామీలు గుప్పించారు. ఆయన అధికారంలోకి వస్తే నియోజకవర్గ రూపురేఖలు మారతాయని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. -
ప్రచారానికి నేటితో తెర
[ 11-05-2024]
ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. -
సభాపతికి నిరసన సెగ
[ 11-05-2024]
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. -
ఎమ్మెల్యే కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదు
[ 11-05-2024]
నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ కోశాధికారి పిసిని జగన్నాథం ఆరోపించారు. -
మట్టి రోడ్లే గతి.. పడకేసిన ప్రగతి
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో శివారు ప్రాంతాలతో పాటుగా కాలనీల్లో శాశ్వత రహదారులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల వాసులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. -
మహిళా సంక్షేమం.. తెదేపా ధ్యేయం
[ 11-05-2024]
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతోపాటు ప్రత్యేక పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెదేపా ధ్యేయమని పలాస, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు గౌతు శిరీష, అశోక్ అన్నారు. -
ప్రముఖుల చేరిక
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘం 23వ వార్డు మాజీ కౌన్సిలర్ బాసి పార్వతీశం, దోనీ రాజు, మరికొంత మంది ముఖ్యనాయకులు, కార్యకర్తలతో తెదేపాలో చేరారు. -
ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
[ 11-05-2024]
పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు ఎం.సురేష్ అన్నారు. -
మిత్రుడి కుటుంబానికి ఆపన్న హస్తం
[ 11-05-2024]
మండలం పరిధి ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేష్ పోలాండ్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. -
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 11-05-2024]
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యులు ఎల్.సుధాకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్