మీరేం అభివృద్ధి చేశారు..?
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ప్రశ్నించిన యువకులపై వైకాపా శ్రేణుల దాడి
నౌపడ ఎస్సై కిశోర్వర్మతో మాట్లాడుతున్న టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్
సంతబొమ్మాళి, న్యూస్టుడే: సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తెదేపా సానుభూతి పరులైన కె.సింహాచలం, కె.సాయికుమార్ను ప్రచారానికి రావాలని వైకాపా కార్యకర్తలు నరసింహులు, ధర్మారావు కోరారు. గతంలో మా గ్రామానికి అచ్చెన్నాయుడు రోడ్డు వేశారని, ఇప్పుడు మీరేం అభివృద్ధి చేశారని, ఎందుకు ప్రచారానికి వస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా కార్యకర్తలు ఆ యువకులపై దాడికి దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య పరస్పరం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైకాపా కార్యకర్త నరసింగరావు ముఖంపై గాయమైంది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అనుచరులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నౌపడ ఎస్సై కిశోర్వర్మ, ఏఎస్సై నరసింగరావు సిబ్బందితో గ్రామానికి వచ్చి.. తెదేపా సానుభూతి పరులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎస్సై కిశోర్వర్మ మాట్లాడుతూ సింహాచలం, సాయికుమార్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనంపై ఉన్న వైకాపా జెండాను వారిద్దరూ తీసేయడంతో గొడవ మొదలైందని చెప్పారు. వైకాపా శ్రేణులు దాడికి పాల్పడి తిరిగి తమపైనే కేసు నమోదు చేయడం అన్యాయమని కె.సింహాచలం, కె.సాయికుమార్ వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతిలో అధికారం.. చేసేదంతా అ‘ధర్మం’..!
[ 11-05-2024]
ఆయనో రాజకీయ దురంధరుడు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్నని, తన మాటలతో ఎంతటి వారినైనా అలవోకగా నమ్మించేస్తారు. -
ఉద్యోగాలేవీ.. ఉపాధి ఉసేది జగన్?
[ 11-05-2024]
గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు.. స్థానిక ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకేనని డప్పుకొట్టారు.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన.. ఇలా.. యువతకు చెప్పనిది లేదు. -
పర్యాటకాన్ని మడతపెట్టేశారు..!
[ 11-05-2024]
జిల్లాలో సహజసిద్ధ పర్యాటక సొబగులు ఎన్నో ఉన్నాయి.. వాటిని పర్యాటకులకు అనుకూలంగా అభివృద్ధి చేస్తే జిల్లాలో ఈ రంగానికి ఎంతో ఆదరణ లభిస్తుంది. -
పేరుతో కిరణం.. ప్రగతిలో అంధకారం..!
[ 11-05-2024]
గత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హామీలు గుప్పించారు. ఆయన అధికారంలోకి వస్తే నియోజకవర్గ రూపురేఖలు మారతాయని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. -
ప్రచారానికి నేటితో తెర
[ 11-05-2024]
ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. -
సభాపతికి నిరసన సెగ
[ 11-05-2024]
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. -
ఎమ్మెల్యే కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదు
[ 11-05-2024]
నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ కోశాధికారి పిసిని జగన్నాథం ఆరోపించారు. -
మట్టి రోడ్లే గతి.. పడకేసిన ప్రగతి
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో శివారు ప్రాంతాలతో పాటుగా కాలనీల్లో శాశ్వత రహదారులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల వాసులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. -
మహిళా సంక్షేమం.. తెదేపా ధ్యేయం
[ 11-05-2024]
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతోపాటు ప్రత్యేక పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెదేపా ధ్యేయమని పలాస, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు గౌతు శిరీష, అశోక్ అన్నారు. -
ప్రముఖుల చేరిక
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘం 23వ వార్డు మాజీ కౌన్సిలర్ బాసి పార్వతీశం, దోనీ రాజు, మరికొంత మంది ముఖ్యనాయకులు, కార్యకర్తలతో తెదేపాలో చేరారు. -
ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
[ 11-05-2024]
పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు ఎం.సురేష్ అన్నారు. -
మిత్రుడి కుటుంబానికి ఆపన్న హస్తం
[ 11-05-2024]
మండలం పరిధి ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేష్ పోలాండ్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. -
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 11-05-2024]
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యులు ఎల్.సుధాకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.