రామేశ్వరం.. రాముడు నడయాడిన నేల
రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం పుణ్యభూమి రామేశ్వరం. రాముడు తన పాప పరిహారం చేసుకున్న పవిత్ర ప్రదేశం.
రామాయణంలో కీలక ఘట్టాలకు నెలవు
శివలింగం ప్రతిష్ఠించిన శ్రీరాముడు
విభీషణుడి పట్టాభిషేకమూ ఇక్కడే
న్యూస్టుడే, ప్యారిస్ : రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం పుణ్యభూమి రామేశ్వరం. రాముడు తన పాప పరిహారం చేసుకున్న పవిత్ర ప్రదేశం. శివుడికి ఆలయం నిర్మించిన గొప్ప నేల. అంతేకాకుండా రావణుడి తమ్ముడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన ప్రాంతంగా ప్రసిద్ధి. అయోధ్యలో రామమందిర కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ రామాయణంతో సంబంధం ఉన్న రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, అక్కడి నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఉన్న విభీషణుడి ఆలయాలను దర్శించుకోనున్నారు. అంతేకాకుండా రామనాథస్వామి ఆలయంలోని అగ్నితీర్థంతో సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను ఆయోద్యకు తీసుకెళ్తున్నారు.
దక్షిణ కాశీగా పేరు
రావణాసురుడిని వధించిన తరువాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు రామనాథపురంలోని సముద్ర తీరంలో మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాడు. ఆ ప్రాంతమే నేడు రామేశ్వరంగా బాసిల్లుతోంది. 15వ శతాబ్దం మొదట్లో పాండ్యులు ఏలిన ఈ ప్రాంతం తర్వాత సేతుపతిరాజుల పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు దీనిని రామనాడు అని పిలవడం ప్రారంభించారు. ఈ ప్రాంతానికి రామనాథపురం జిల్లాగా మార్చారు. రామనాథపురం అంటే అందరికీ గుర్తొచ్చే ఆధ్యాత్మిక ప్రాంతం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం. ఈ ఆలయానికి ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. 690 అడుగుల పొడవు, 435 అడుగుల వెడల్పు, 1212 స్తంభాలతో కూడిన ప్రకారంతో ఈ ఆలయం ప్రసిద్ధి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయంలోని శివలింగం ఒకటి. ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీలోని గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి విశ్వనాథుడిని ప్రార్థిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. ఆ విధంగానే దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరంలోని అగ్ని తీర్థం, ఆలయంలో ఉన్న 22 తీర్థాల్లో స్నానం ఆచరించి రామనాథస్వామిని ఆరాధిస్తే మోక్షం దక్కుతుందని ప్రతీతి.
పాపాలు హరించే అగ్ని తీర్థం
రావణుడు చెర నుంచి విడిపించి తీసుకొచ్చిన సీతాదేవి తన పాతివ్రత్యం నిరూపించుకునేందుకు రాముడు ఇక్కడ అగ్నిప్రవేశం చేయించాడు. అప్పుడు సీతాదేవి పాతివ్రత్యం తట్టుకోలేని అగ్నిదేవుడు సముద్రంలో మునిగి ఉపశమనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని అగ్నితీర్థంగా పిలుస్తారు.
కోదండరామాలయం
కడలి మధ్యలో కోదండరామాలయం
రామేశ్వరంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం ముఖ్యమైన పుణ్యస్థలం. రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్లే మార్గంలో ఉన్న చిన్న దీవిలో ఈ ఆలయం ఉంది. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయం నుంచి బయటపడిన ఒకేఒక చారిత్రక నిర్మాణం ఇదే. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్, విభీషణుడు కొలువుదీరి ఉన్నారు. రాముడు విల్లుతో ఉండటంతో కోదండరాముడిగా పేరు. విభీషణుడు రాముడు, ఆయన వానర సైన్యాన్ని ఆశ్రయించిన ప్రాంతంగా దీనిని భావిస్తారు. రావణాసురుడు సీతను అపహరించిన తరువాత విభీషణుడు ఆమెను తిరిగి పంపాలని రావణుడికి చెప్పినప్పటికీ రావణుడు వినకపోవడంతో విభీషణుడు లంకను వదిలి వచ్చి రాముడు రామేశ్వరంలో ఉన్నట్లు తెలుసుకుని ఇక్కడకు చేరుకున్నాడు. రావణ వధ తరువాత రాముడు ఈ ప్రాంతంలోనే విభూషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఏటా రామనాథస్వామి ఆలయంలో రామలింగ ప్రతిష్ఠ తిరునాల సమయంలో విభీషణుడి పట్టాభిషేకం నిర్వహిస్తారు.
రామనాథస్వామి ఆలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మాణాల్లో నిబంధనలేవి?
[ 13-05-2024]
చెన్నై నగరం, శివారులో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు జరుగుతున్నవి, అలాగే గతంలో జరిగిన నిర్మాణాల్లో ఎన్నో ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. వీటిని అరికట్టడంలో వ్యవస్థలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
లేళ్లపల్లి రమేష్కు సేవారత్న పురస్కారం
[ 13-05-2024]
కాంచీపురం కామాక్షి అమ్మవారి సన్నిధి సమీపంలో ఉన్న కామాక్షి అమ్మవారి కల్యాణ మండపంలో ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు ఎస్ఎస్ఎస్ భారతి ట్రస్ట్, -
తెలంగాణలో 9 ఎంపీ స్థానాలు కైవసం
[ 13-05-2024]
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ సోమవారం అక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారం చెన్నై చేరుకున్నారు. -
మెరీనా తీరంలో సెయిలింగ్ అకాడమి
[ 13-05-2024]
చెన్నై మెరీనా తీరంలో రూ.7 కోట్ల వ్యయంతో సెయిలింగ్ అకాడమీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కోస్టల్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి కోసం తమిళనాడు క్రీడాభివృద్ధి కమిషన్ విన్నవించింది. -
గిరిజనులపై దాడులను సహించేదిలేదు
[ 13-05-2024]
ధర్మపురి జిల్లా హొగినేకల్లో గిరిజనులను అటవీశాఖ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించడాన్ని ఖండిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి పేర్కొన్నారు. -
అర్ధరాత్రీ అందుబాటులో ఆహారం
[ 13-05-2024]
రాష్ట్రంలో ‘తూంగానగరం’ (నిద్రించని నగరం) అని మదురైకి పేరు. ప్రస్తుతం చెన్నై మహానగరం కూడా ఈ కోవలోకి వచ్చింది. మహానగరంలోని అన్నానగర్, తిరుమంగళం, అన్నాసాలై, పులియాంతోపు, నుంగంబాక్కం, గిండి తదితర ప్రాంతాలలో తెల్లారే వరకు హోటళ్లు నడుస్తున్నాయి. -
బాల్యంలోనే బరువుబాధ్యతలు!
[ 13-05-2024]
తమిళనాడులో బాలికా గర్భాలు (టీనేజ్ ప్రెగ్నెన్సీ)లు ఏటా అధికమవుతున్నాయని క్షేత్రస్థాయి బాలల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఇందుకు బాల్య వివాహాలే కారణమని అంటున్నారు. -
ఇంటి బయట నిద్రిస్తున్న ఏడుగురిపై వెళ్లిన కారు
[ 13-05-2024]
గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని కారు నడిపిన ఓ మహిళ.. ఏడుగురిని గుద్దిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై అశోక్నగర్కు చెందిన మారియప్పన్, సరిత భార్యాభర్తలు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
[ 13-05-2024]
లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు..