గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు.
ఎడప్పాడి
ప్రజలకు శీతలపానీయం అందిస్తున్న పళనిసామి
సేలం, న్యూస్టుడే: కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. శనివారం సేలం జిల్లాలోని ఎడప్పాడిలో చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విపత్తు నిధుల విషయంలో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుపట్టడం సరికాదన్నారు. తమిళనాడులో అనేకసార్లు తుపాను, వరదలు వచ్చి ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. అలాంటి సందర్భాలలో రాష్ట్రం కోరిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అందించలేదన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా కోరిన నిధులు దక్కలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు మత్తుపదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్పాలతో పరవశం
[ 11-05-2024]
నీలగిరి జిల్లా ఊటీలో 126వ పుష్ప ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పుష్పాలతో అలంకరించిన ఏనుగు, ఊటీ మౌంటెయిన్ రైలు, డిస్నీ వరల్డ్, సింహంతో పాటు పలు జంతువుల కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
10వ తరగతిలో 91.55 శాతం ఉత్తీర్ణత
[ 11-05-2024]
రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 8వరకు జరిగాయి. మొత్తం 8,94,264 మంది రాశారు. ఫలితాలను శుక్రవారం ఉదయం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సేతువర్మ విడుదల చేశారు. -
ఎన్నికల్లో మోదీపై పోటీకి బయల్దేరిన రైతులు
[ 11-05-2024]
రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ ఖరారైనా నిరీక్షణ జాబితాలో పెట్టారంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన దక్షిణ నదుల భద్రతా రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను వారణాసి నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. -
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. 24 గంటల్లో సాధారణం కన్నా 5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. -
విద్యార్థులూ.. వినండి
[ 11-05-2024]
ప్లస్ టూ, 10వ తరగతిలో మార్కులు ఘనంగా వచ్చాయని సంబరపడిపోయేవారు ఒకవైపు.. సరిగా రాక కుమిలిపోయే విద్యార్థులు మరోవైపు. రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఆశించిన మార్కులు రాకపోవడమో, ఫెయిల్ అయిపోవడమోలాంటి కారణాలతో క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
విమానాశ్రయంలో వాకలేటర్ సేవలు
[ 11-05-2024]
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్లను అనుసంధానం చేసేందుకు కొత్తగా వాకలేటర్తో పాటు మల్టీ లెవల్ కారు పార్కింగు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నగర విమానాశ్రయ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
34 ఏళ్ల తర్వాత చేతికొచ్చిన సొంతిల్లు
[ 11-05-2024]
చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో పని చేసి పదవీవిరమణ చేసిన డీన్ విక్టర్కు షెనాయ్నగర్ ప్రాంతంలో సొంతిల్లు ఉంది. 2 గ్రౌండ్ల స్థలంలోని ఇంటిని వేరొకరిని చూసుకోమని చెప్పి 34 ఏళ్ల కిందట ఆయన అమెరికా వెళ్లి పోయాడు. -
అలవోకగా శాస్త్రీయనామాలు చెప్తున్న బాలుడు
[ 11-05-2024]
కూరగాయలు, పండ్ల శాస్త్రీయ నామాలు సెకన్లలో చెప్తూ ఓ బాలుడు అబ్బురపరుస్తున్నాడు. దిండుక్కల్ జిల్లా పళని నెయిక్కారపట్టికి చెందిన మహ్మద్ హిసామ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
[ 11-05-2024]
తన ప్రియుడు వేరొకరికి దక్కకూడదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. పెట్రోల్పోసి నిప్పంటించింది. ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పదో తరగతి ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య
[ 11-05-2024]
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పళ్లిపట్టు తాలూకా మేల్పొదటూర్ ప్రాంతానికి చెందిన మురళి, నదియ భార్యభర్తలు. కుమారి(15) అనే కుమార్తె ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి