logo

గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం

కేంద్రంలో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు.

Published : 28 Apr 2024 00:38 IST

ఎడప్పాడి

ప్రజలకు శీతలపానీయం అందిస్తున్న పళనిసామి

సేలం, న్యూస్‌టుడే: కేంద్రంలో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. శనివారం సేలం జిల్లాలోని ఎడప్పాడిలో చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విపత్తు నిధుల విషయంలో ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని మాత్రమే తప్పుపట్టడం సరికాదన్నారు. తమిళనాడులో అనేకసార్లు తుపాను, వరదలు వచ్చి ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. అలాంటి సందర్భాలలో రాష్ట్రం కోరిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అందించలేదన్నారు. గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా కోరిన నిధులు దక్కలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు మత్తుపదార్థాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని