పనిలేక పస్తులు
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది.
రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం
ఉపాధి లేక అవస్థలు పడుతున్న జాలర్లు
న్యూస్టుడే, వడపళని
కాశిమేడు తీరంలో నిలిపిన పడవలు
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. ఏటా ఏప్రిల్ 13 నుంచి జూన్ 14వ తేదీ వరకు అర్ధరాత్రి చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. కావున కేంద్రం తిరువళ్లూరు జిల్లాలోని ఆరంబాక్కం నుంచి కన్యాకుమారి వరకు చేపల వేటను నిషేధించింది. 28 హెచ్పీ (హార్స్ పవర్)తో కూడిన మర పడవలతో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టకూడదని పేర్కొంది. ప్రస్తుతం నిషేధం ప్రారంభమైన తరుణంలో కాశిమేడు హార్బరులో 800కు పైగా మర పడవలు ఒడ్డుకు చేరాయి. ఫైబర్ పడవలు మాత్రమే ఈ సమయంలో వేటకు వినియోగిస్తున్నారు.
80 వేల మందికి ఉపాధి కరవు
జాలర్ల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. చేపల వేట నిషేధిత కాలంలో రాష్ట్రంలో 80 వేల మందికి పైగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని అంటున్నారు. నిషేధ సమయంలో ప్రభుత్వం రూ.5 వేల రుణ సాయాన్ని అందిస్తోందని, గత ఏడాది దీనిని రూ.8 వేలకు ముఖ్యమంత్రి పెంచినట్లు తెలిపారు. చేపల వేట నిషేధాన్ని అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పశ్చిమ తీరం, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల్లో కూడా విధిస్తున్నారు. రాష్ట్రంలో 16 జిల్లాలు, చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, పుదుచ్చేరి, కారైక్కాల్లో వేసవి నెలలైన ఏప్రిల్, మే, జూన్లో నిషేధం అమల్లో ఉంటోంది. ఈ సమయంలో చేపల సంతానోత్పత్తికి ఆస్కారం లేదని, కనుక ప్రభుత్వం అధ్యయనం చేసి నిషేధ కాలాన్ని మార్చాల్సిందిగా జాలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఫైబర్ పడవలు అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని, కావున రేవుల వద్ద అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
ధరలు రెండింతలు
వారాంతపు రోజుల్లో కాశిమేడు చేపల మార్కెట్టు కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం వేటపై నిషేధం అమల్లో ఉండటంతో మార్కెట్కు వచ్చే చేపల సంఖ్య తగ్గిపోయింది. దీంతో చేపలు, పీతలు, రొయ్యల ధరలు రెండింతలయ్యాయి. మరో రెండు నెలల వరకు ధరలు ఇలాగే ఉంటాయని జాలర్లు చెబుతున్నారు. అదేసమయంలో పలువురు తమ పడవలకు మరమ్మతులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు కొత్త పడవలు సిద్ధం చేసుకుంటున్నారు. చెంగల్పట్టు జిల్లాలో కానాత్తూరు రెడ్డికుప్పం నుంచి ఇడైక్కళినాడు ఆలంబరై కుప్పం వరకు 30 కుగ్రామాలున్నాయి. ఇందులో 7,500 మందికి పైగా జాలర్లు ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థులే ఐఐటీ బలం!
[ 14-05-2024]
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థుల శ్రేయస్సు, దేశం కోసం ఎన్నో ప్రాజెక్టులు తెస్తోంది. భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. ఈ విద్యాసంస్థ ఈ తరహాలో దూసుకుపోయేందుకు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులే కారణమని అంటున్నారు -
పాఠకుల సంఖ్య పెంచుతా: రచయిత శివశంకర్
[ 14-05-2024]
నేటితరం యువత సెల్ఫోన్లకే పరిమితమవుతున్న తరుణంలో వారి దృష్టిని పుస్తకాల వైపు మళ్లించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ‘బుక్స్ అండ్ రీడర్స్-ఫిలిమ్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అద్యక్షుడు శివశంకర్ పేర్కొన్నారు. -
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ కన్నుమూత
[ 14-05-2024]
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్ (67) సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తిరువారూర్ జిల్లా నీడామంగళం కప్పలుడైయాన్ గ్రామానికి చెందిన సెల్వరాజ్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. -
జైలులో ప్రాణానికి ముప్పు: సవుక్కు శంకర్
[ 14-05-2024]
జైల్లో తన ప్రాణానికి ముప్పు ఉందని సవుక్కు శంకర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ సవుక్కు శంకర్ను పోలీసులు -
కన్నియాకుమరిలో జోరుగా వర్షాలు
[ 14-05-2024]
కన్నియాకుమరి జిల్లాలో గత కొన్నిరోజులుగా సాధారణం కంటే అధికంగా ఎండలు మండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఇంజినీరింగ్లో ఏఆర్ అండ్ వీఆర్ కోర్సు
[ 14-05-2024]
అన్నా విశ్వవిద్యాలయం (ఏయూ) ప్రాంగణంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (సీఈజీ) 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘ఆగ్మెంటెడ్ రియాల్టి అండ్ వర్చువల్ రియాల్టి’ (ఏఆర్ అండ్ వీఆర్) మూడేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించేందుకు ఆలోచిస్తోంది. -
మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
[ 14-05-2024]
విళుపురం జిల్లా మరక్కాణం సమీపం కానిమేడు గ్రామానికి చెందిన చక్రవర్తి, వనిత దంపతులకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. -
పట్టాలపై పడుకున్న ముగ్గురు యువకులు
[ 14-05-2024]
పట్టాలపై నిద్రించిన ముగ్గురు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నాగపట్టిణం జిల్లా వేదారణ్యంకు చెందిన కుమారసారథి(18), తులసి నారాయణన్(18), ప్రభాకరన్(18) అనే ముగ్గురు యువకులు -
నడిగర్ సంఘానికి ధనుష్ విరాళం
[ 14-05-2024]
ఆర్థిక సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన నడిగర్ సంఘం భవన నిర్మాణ పనుల కోసం పలువురు నటులు స్వచ్ఛందంగా తమవంతు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
-
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్