కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
మదురై విమానాశ్రయం నుంచి బయటకొస్తున్న స్టాలిన్ దంపతులు
చెన్నై, న్యూస్టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పర్యటనకు సోమవారం కొడైకెనాల్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు, మంత్రి సుబ్రమణియన్ తదితరులు వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానం ద్వారా మదురై వెళ్లి అక్కడి నుంచి కారు ద్వారా కొడైకెనాల్ చేరుకున్నారు.
గంజాయితో పాటు వినతి ఇవ్వడానికి యత్నించిన భాజపా నాయకుడి అరెస్టు
ప్యారిస్: ముఖ్యమంత్రికి గంజాయితో పాటు వినతి ఇవ్వడానికి భాజపా నాయకుడు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. కుటుంబంతో పాటు కొడైక్కానల్కి బయల్దేరిన ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నుంచి మదురై విమానాశ్రయానికి వచ్చారు. వ్యక్తిగత పర్యటన కావడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలకు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద ఓ వ్యక్తి నిల్చుని ఉండడంతో పోలీసులు ఆరా తీశారు. ఆయన మదురైకి చెందిన భాజపా ప్రముఖుడు శంకరపాండి, సీఎంకు వినతి ఇవ్వడానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు అతని నుంచి గంజాయి, వినతిపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి, మత్తుపదార్థాల వినియోగం ఎక్కువైందని, సులభంగా లభిస్తుండడంతో యువత, విద్యార్థులు, పేద కూలీలు, చిన్నారులు మత్తుకు బానిసైయ్యారని, నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. గంజాయితో పాటు వినతి ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పడంతో అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో గంజాయి ఆర్డర్లు!
[ 16-05-2024]
ఆన్లైన్ షాపింగ్ అందరికీ తెలుసు. అందులో గంజాయి ఆర్డర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చెన్నై నగరంలో గుట్టుగా సాగుతోంది. -
మహానగరం మరింత విస్తరణ
[ 16-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు మరింత విస్తరించనున్నాయి. -
రుతుపవనాలు ప్రవేశించేలోపుకొత్త రోడ్ల నిర్మాణం
[ 16-05-2024]
రుతుపవనాలు ప్రవేశించేలోపు 320 కి.మీ. మేర, 2,139 కొత్త రోడ్లు వేసేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
మహిళా పోలీసులు దాడి చేశారు
[ 16-05-2024]
తిరుచ్చికి వాహనంలో తీసుకొస్తున్నప్పుడు మహిళా పోలీసులు తనపై దాడి చేసి ఫొటోలు తీశారని, వాటిని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేశారని యూట్యూబర్ సవుక్కు శంకర్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. -
అన్నాడీఎంకే నుంచి వచ్చినవారికే మంత్రి పదవులు
[ 16-05-2024]
డీఎంకే మంత్రివర్గంలో ముందు వరుసలో ఉన్నవారంతా అన్నాడీఎంకేలో తల్లిపాలు తాగినవారేనని మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు. -
కేంద్ర సర్వీసులకు ఇద్దరు మహిళా డీఐజీలు
[ 16-05-2024]
రాష్ట్రంలో ఇద్దరు మహిళా డీఐజీలు కేంద్ర ప్రభుత్వ సర్వీల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. -
జూన్లో మళ్లీ విడాముయర్చి చిత్రీకరణ
[ 16-05-2024]
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో ‘విడాముయర్చి’ సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకేను చీల్చం: మాజీ మంత్రులు
[ 16-05-2024]
అన్నాడీఎంకేను చీల్చబోమని మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ స్పష్టం చేశారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
[ 16-05-2024]
రాష్ట్రంలో తిరుప్పూర్, కోవై, తేని, నామక్కల్, అరియలూర్ తదితర జిల్లాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM