ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు
చెన్నైలోని 200 బడుల్లో ఏర్పాటుకు సన్నాహాలు
న్యూస్టుడే, వడపళని: విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 200 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో నెలకు రూ.1,500 ఖర్చు చేసే విధంగా, 30 ఎంబీపీఎస్ కనీస స్పీడుతో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.
స్మార్ట్ తరగతి గదులు
రాష్ట్ర విద్యాశాఖ తరగతి గదులను డిజిటలైజ్ చేసి స్మార్ట్ గదులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉంది. మరి కొద్ది నెలల్లో 25 వేల ప్రాథమిక పాఠశాలలు, 7,904 మాధ్యమిక పాఠశాలల్లో హైటెక్ ల్యాబ్లను రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఇంటర్నెట్ కనెక్షన్లు లేకుండా ఇవన్నీ ఉన్నా ఉపయోగం ఉండదని భావించి ముందుగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల పాఠశాలల్లో ఇప్పటికే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. చెన్నై నగరంలో కొన్ని పాఠశాలల్లో ఇంకా పూర్తిగా అందుబాటులో లేవు. జూన్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో మే నెలలోగా కనెక్షన్ల పనులు పూర్తి చేయనున్నారు.
పలు పనులకు ఉపయోగంగా కనెక్షను
2022లో సాంకేతికతతో కూడిన విద్యకు మంచి ప్రాముఖ్యత ఏర్పడటంతో ప్రభుత్వం కూడా తరగతి గదుల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. 2022లో ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్’ (యూడీఐఎస్ఈ+) సమర్పించిన నివేదికలో రాష్ట్రంలోని 18 శాతం పాఠశాలల్లో మాత్రమే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నట్టు పేర్కొంది. దీంతో అన్ని పాఠశాలల్లో విస్తరించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసినా ఇంటర్నెట్ కనెక్షను లేదు. బ్రాడ్బ్యాండ్ కనెక్షను లేకపోవడంతో విద్యార్థుల అభివృద్ధి, పరిపాలనాపరమైన పనులకు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఈఎంఐఎస్)కు సంబంధించిన సమాచారం, విద్యార్థుల హాజరు, పరీక్షల రికార్డు, తాజా పాఠ్యాంశాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ కనెక్షను అవసరమని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో గంజాయి ఆర్డర్లు!
[ 16-05-2024]
ఆన్లైన్ షాపింగ్ అందరికీ తెలుసు. అందులో గంజాయి ఆర్డర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చెన్నై నగరంలో గుట్టుగా సాగుతోంది. -
మహానగరం మరింత విస్తరణ
[ 16-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు మరింత విస్తరించనున్నాయి. -
రుతుపవనాలు ప్రవేశించేలోపుకొత్త రోడ్ల నిర్మాణం
[ 16-05-2024]
రుతుపవనాలు ప్రవేశించేలోపు 320 కి.మీ. మేర, 2,139 కొత్త రోడ్లు వేసేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
మహిళా పోలీసులు దాడి చేశారు
[ 16-05-2024]
తిరుచ్చికి వాహనంలో తీసుకొస్తున్నప్పుడు మహిళా పోలీసులు తనపై దాడి చేసి ఫొటోలు తీశారని, వాటిని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేశారని యూట్యూబర్ సవుక్కు శంకర్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. -
అన్నాడీఎంకే నుంచి వచ్చినవారికే మంత్రి పదవులు
[ 16-05-2024]
డీఎంకే మంత్రివర్గంలో ముందు వరుసలో ఉన్నవారంతా అన్నాడీఎంకేలో తల్లిపాలు తాగినవారేనని మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు. -
కేంద్ర సర్వీసులకు ఇద్దరు మహిళా డీఐజీలు
[ 16-05-2024]
రాష్ట్రంలో ఇద్దరు మహిళా డీఐజీలు కేంద్ర ప్రభుత్వ సర్వీల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. -
జూన్లో మళ్లీ విడాముయర్చి చిత్రీకరణ
[ 16-05-2024]
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో ‘విడాముయర్చి’ సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకేను చీల్చం: మాజీ మంత్రులు
[ 16-05-2024]
అన్నాడీఎంకేను చీల్చబోమని మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ స్పష్టం చేశారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
[ 16-05-2024]
రాష్ట్రంలో తిరుప్పూర్, కోవై, తేని, నామక్కల్, అరియలూర్ తదితర జిల్లాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్