ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ప్యారిస్, న్యూస్టుడే: ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. అగ్నినక్షత్రం ప్రారంభం కాకముందే పగటిపూట ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. కొద్ది రోజులుగా చెన్నైలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సముద్రపు గాలి కారణంగా గాలిలో తేమ 70 శాతం వరకు ఉంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27-28 డిగ్రీల సెల్సియస్ వరకు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని పేర్కొంది. సముద్రతీర జిల్లాల్లో గాలిలో తేమ 50-80 శాతం వరకు ఉంటుందని తెలిపింది. సోమవారం నుంచి మే 2వ తేదీ వరకు ఉత్తర తమిళనాడులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు, మిగిలిన జిల్లాల్లో 3 డిగ్రీల వరకు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడులోని లోతట్టు జిల్లాల్లో కొన్నిచోట్ల వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తర తమిళనాడులో తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం అత్యంత తీవ్రంగా ఉంటాయని పసుపు రంగు హెచ్చరిక జారీచేసింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్, చుట్టుపక్కల ప్రాంతాల్లో అల్పపీడనం నెలకొంటుందని, ఆ కారణంగా కన్నియాకుమరి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.
మే 1-4 వరకు...: రాష్ట్రంలో మే 1 నుంచి 4వ తేదీ వరకు వేడిగాలుల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని తమిళనాడు వెదర్మెన్ ప్రదీప్జాన్ తెలిపారు. ఆయన తన ఎక్స్ పేజీలో.. మే 1 నుంచి 4వ తేదీ వరకు వేలూర్, రాణిపేట, తిరువళ్లూర్, కాంచీపురం, ఈరోడు, సేలం, నామక్కల్, తిరుచ్చి, కరూర్ తదితర జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. లోతట్టు జిల్లాల్లో 5 తేదీ తర్వాత వర్షాలు కురుస్తాయన్నారు. ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం తరఫున, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ అందుకు తగ్గట్టుగా ప్రజలకు అవగాహన కల్పించాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో గంజాయి ఆర్డర్లు!
[ 16-05-2024]
ఆన్లైన్ షాపింగ్ అందరికీ తెలుసు. అందులో గంజాయి ఆర్డర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చెన్నై నగరంలో గుట్టుగా సాగుతోంది. -
మహానగరం మరింత విస్తరణ
[ 16-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు మరింత విస్తరించనున్నాయి. -
రుతుపవనాలు ప్రవేశించేలోపుకొత్త రోడ్ల నిర్మాణం
[ 16-05-2024]
రుతుపవనాలు ప్రవేశించేలోపు 320 కి.మీ. మేర, 2,139 కొత్త రోడ్లు వేసేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
మహిళా పోలీసులు దాడి చేశారు
[ 16-05-2024]
తిరుచ్చికి వాహనంలో తీసుకొస్తున్నప్పుడు మహిళా పోలీసులు తనపై దాడి చేసి ఫొటోలు తీశారని, వాటిని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేశారని యూట్యూబర్ సవుక్కు శంకర్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. -
అన్నాడీఎంకే నుంచి వచ్చినవారికే మంత్రి పదవులు
[ 16-05-2024]
డీఎంకే మంత్రివర్గంలో ముందు వరుసలో ఉన్నవారంతా అన్నాడీఎంకేలో తల్లిపాలు తాగినవారేనని మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు. -
కేంద్ర సర్వీసులకు ఇద్దరు మహిళా డీఐజీలు
[ 16-05-2024]
రాష్ట్రంలో ఇద్దరు మహిళా డీఐజీలు కేంద్ర ప్రభుత్వ సర్వీల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. -
జూన్లో మళ్లీ విడాముయర్చి చిత్రీకరణ
[ 16-05-2024]
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో ‘విడాముయర్చి’ సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకేను చీల్చం: మాజీ మంత్రులు
[ 16-05-2024]
అన్నాడీఎంకేను చీల్చబోమని మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ స్పష్టం చేశారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
[ 16-05-2024]
రాష్ట్రంలో తిరుప్పూర్, కోవై, తేని, నామక్కల్, అరియలూర్ తదితర జిల్లాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!