logo

ఎనిమిదేళ్ల కిందట.. సరిగ్గా ఇక్కడే..

నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. గతంలో ఇదే తరహా ఘోర రోడ్డు ప్రమాదం ఇక్కడే జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.

Published : 28 Apr 2024 03:48 IST

వెదుళ్లపాలెం వద్ద ప్రమాదంతో ఉలిక్కిపాటు

వెదుళ్లపాలెం వద్ద ఎనిమిదేళ్ల కిందట జరిగిన ఘోర ప్రమాదం

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. గతంలో ఇదే తరహా ఘోర రోడ్డు ప్రమాదం ఇక్కడే జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. విశాఖకు చెందిన రెండు, మూడు కుటుంబాలకు చెందిన బంధువులు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ప్రమాదంలో కారు సైతం అదుపుతప్పి రోడ్డును దాటుకుని అవతల నుంచి వస్తున్న దాదాపు అప్పటిలాంటి లారీనే ఢీకొట్టింది. ఈ ప్రమాదాన్ని చూసిన వారంతా నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకుని భయాందోళనకు గురయ్యారు. అప్పటి ప్రమాదంతో పోల్చుతూ ఒకే తరహా ప్రమాదం జరగడంపై విస్తృతంగా చర్చించారు.జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని