‘కొర్రీల’మస్తు.. ‘ఆంక్షల’ తోఫా
పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది.
జగన్ తీరుతో ‘వైఎస్సార్ కల్యాణమస్తు’ పథకానికి లబ్ధిదారులు దూరం
పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఈ పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అనంతరం అమలులోకి తీసుకొచ్చినా మంజూరు విషయంలో విధానాలను కఠినతరం చేయడంతో లబ్ధిదారులకు అవస్థలే మిగిలాయి. తెదేపా హయాంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి రోజుల వ్యవధిలోనే కానుక అందేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధన తీసుకురావడంతో చాలామంది ఈ పథకానికి అనర్హులుగా మారుతున్నారు.
పెందుర్తి, వేపగుంట, సబ్బవరం, పరవాడ, న్యూస్టుడే
ధ్రువీకరణ కోసం తిప్పలు
నా పెళ్లి ఆగస్టు 2020లో జరిగింది. వైఎస్సార్ కల్యాణ మస్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. సచివాలయంలో సంప్రదిస్తే పెళ్లి ధ్రువీకరణ పత్రం కావాలన్నారు. ఈ ధ్రువీకరణ కోసం పలు కార్యాలయాలకు తిరగాల్సి వచ్చింది. పెళ్లి కానుక అమలులో నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ కావాలంటే అక్కడ కూడా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఎ.రఘు
ప్రయోజనం శూన్యం
తెదేపా హయాంలో కంటే కల్యాణమస్తు నిధులు పెంచామని వైకాపా నాయకులు చెప్పడం తప్ప దాన్ని సకాలంలో లబ్ధిదారులకు అందించిన దాఖలాలు లేవు. దీనివల్ల లబ్ధిదారులకు ఏమి ఉపయోగమో వైకాపా నాయకులే చెప్పాలి.
గుణ, మహిళ
కొందరికే ఇస్తున్నారు..
కల్యాణమస్తు పథకం అందరిదీ అని ప్రకటించినప్పటికీ కొందరు మాత్రమే ప్రయోజనం పొందారు. ఆశ్రిత పక్షపాతంతో నేతలు వ్యవహరించారు. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వైకాపా నాయకులకు అనుకూలమైన వారికి మాత్రమే వచ్చేలా చేశారు. మిగిలిన వారికి ఏవో కుంటి సాకులు చెప్పి ప్రయోజనం పొందకుండా చేశారు.
బి.అప్పల రామలింగేశ్వరరావు, గుల్లేపల్లి
నెలలు తరబడి ఎదురు చూడాల్సిందే..
కల్యాణమస్తు పథకానికి దరఖాస్తు చేస్తే నగదు కోసం నెలలు తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతీ పథకాన్ని నిమిషాల్లో లబ్ధిదారులకు అందించడం కోసమే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పే వైకాపా ప్రభుత్వం కల్యాణమస్తును మాత్రం సక్రమంగా అందించడం లేదు.
గౌరీ, మహిళ
గతంలో వారం రోజుల్లో..
గతంలో పెళ్లయిన వారం రోజుల్లో ఖాతాలకు నిధులు జమయ్యేవి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపేయడంతో పేద కుటుంబాల వివాహాల నిమిత్తం ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం చాలామంది లబ్ధిదారులకు సొమ్ము జమకాలేదు. అధికారులను అడిగినా సరైన సమాధానం రావడం లేదు.
ఈ.సోమునాయుడు
నిబంధనల పేరుతో కోత..
నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలని చెప్పిన జగన్ కల్యాణమస్తు పథకం అందరికీ అందకుండా చేశారు. చిరుద్యోగం ఉందని, విద్యుత్ బిల్లు పెరిగిపోయిందని కుంటి సాకులు చెప్పి లబ్ధిదారులకు నిధులు అందకుండా చేస్తున్నారు. ఎవరైతే వైకాపా పార్టీకి చెందిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఇస్తున్నారు.
ఆర్.శ్రీనివాసరావు, బల్జిపాలెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో రోజూ.. ‘భూ’కంపమే!!
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖ నగరం ఉలిక్కిపడేలా ‘జె’ గ్యాంగ్ రెచ్చిపోయింది. వివాదాల్లో ఉన్న విలువైన భూముల్ని లాక్కొంది. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసింది. భారీ ప్రాజెక్టులు చేతులు మారిపోయాయి. -
చంద్రబాబుకు ముస్లిం మతపెద్దల మద్దతు
[ 11-05-2024]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తెదేపా కార్యాలయంలో వారు చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు. -
ఫలితాన్ని శాసించే ‘పోస్టల్ బ్యాలెట్’..!
[ 11-05-2024]
ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్లు ఫలితాన్ని శాసిస్తాయా అంటే.. ఉద్యోగ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలట్ ఓట్లు నమోదయ్యాయి. -
సూపర్-6 పథకాలతో మేలు: శ్రీభరత్
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, తెదేపా కూటమి ప్రభుత్వంలో వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
పింఛను రూ.4 వేలు ఇస్తాం: తెదేపా
[ 11-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో రూ.4 వేల పింఛను అందిస్తామని పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
త్వరితగతిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తాం..
[ 11-05-2024]
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యశ్రీ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించేలా చూస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. -
జగన్.. ఇదేం మెలిక..!
[ 11-05-2024]
గాజువాక హౌస్కమిటీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నామంటూ ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం... చివరకు ఆంక్షల పేరుతో బాధితులకు చుక్కలు చూపించింది. హక్కు పత్రాలు (కన్వెన్షన్ డీడ్) చేతికి ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టింది. -
అపురూపం.. నిజరూప దర్శనం
[ 11-05-2024]
సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకున్నారు. అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని చేసిన పకడ్బందీ సన్నాహాలతో ఎక్కడా ఇబ్బంది కలగలేదు. -
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
[ 11-05-2024]
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. -
కేజీహెచ్ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
[ 11-05-2024]
కేజీహెచ్ గ్రేడ్1 నర్సింగ్ సూపరింటెండెంట్ జె.విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
ఓటు అనే ఆయుధాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి
[ 11-05-2024]
మీ ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ను తరిమికొట్టాలని కూటమి (భాజపా) శాసనసభ అభ్యర్థి విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. -
జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తా!
[ 11-05-2024]
తనను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లి జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
-
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!