‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’
అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు.
సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
కాశీబుగ్గ, న్యూస్టుడే: అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. మతతత్వ పార్టీగా ముద్రవేసుకున్న భాజపా కులాలు, మతాల పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని మోదీ, అమిత్షా తదితర ముఖ్య నేతలు మాట్లాడటం సరికాదన్నారు. రాజీవ్గాంధీ రిజర్వేషన్లు తేవడం వల్లే తనలాంటి మహిళలు ఎందరో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రాజకీయాల్లో ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వరంగల్ తూర్పులో రెండు రోజుల్లో కడియం కావ్య రోడ్షో ఉంటుందని సురేఖ వివరించారు. భారాస కార్పొరేటర్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. భారాస వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. వరంగల్ మేయర్గా గుండు సుధారాణి ఉంటారని ఓ ప్రశ్నకు మంత్రి సురేఖ బదులిచ్చారు.
ముఖ్యనేతలు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష
అంతకుముందు క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య సైతం సమీక్షకు హాజరయ్యారు. ఒక్కో బూత్కు 10 మందిని నియమిస్తూ ఓ జాబితా సిద్ధం చేశారు. బూత్ కమిటీలో కీలకంగా వ్యవహరించే వారికే ఎంపీ ఎన్నికల అనంతరం ఇందిరమ్మ కమిటీల్లోనూ అవకాశం దక్కనున్న నేపథ్యంలో తమ పేర్లు రాయాలని పార్టీ శ్రేణులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ 26వ డివిజన్ అధ్యక్షుడు జన్ను భాస్కర్, మాజీ కార్పొరేటర్ తత్తరి లక్ష్మణ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి ఎదుటే ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. మంత్రి సురేఖ వారించడంతో గొడవ సద్దుమణిగింది. సమీక్ష జరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే కార్యాలయం కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయం ముఖద్వారం మూసేశారు. అయినా ప్రభాకర్ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో గొడవ జరిగింది. సమీక్ష జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాత వారిని బయట నిలబెట్టి ఇటీవల పార్టీలో చేరిన వారిని లోపలికి పంపిస్తున్నారని మరికొందరు కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలకు డివిజన్ బాధ్యులకు జెండాలు, ప్రచార సామగ్రి అందించారు. సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, పీసీసీ సభ్యుడు నల్గొండ రమేశ్, సీనియర్ నేతలు ఎల్.శ్రీనివాస్, జన్ను రవి, గోరంట్ల రాజు, చిప్ప వెంకటేశ్వర్లు, నవీన్రాజ్, మహిళా నాయకురాళ్లు నారగోని స్వప్న, మంతెన సునీత, గిరిగిరి పుష్ప తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగటిపూట దోమ.. ప్రాణాంతకమే..!
[ 16-05-2024]
ఈడెస్ రకానికి చెందిన ఆడదోమ ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. -
వనితే.. నిర్ణేత!
[ 16-05-2024]
ఒకప్పుడు మహిళలు ఓటింగ్కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి ఎన్నికల్లో వారిదే పైచేయి అవుతోంది. -
నాణ్యత యంత్రాలు.. నమూనాకే పరిమితం
[ 16-05-2024]
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గతేడాది మిర్చి పంటకు ఊహించని రీతిలో ధరలు వచ్చాయి. -
పరకాలలో గరిష్ఠం.. పశ్చిమలో కనిష్ఠం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో 64.76శాతం ఓటింగ్ నమోదైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 59 పోలింగ్ కేంద్రాలు
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
పెరిగిన పోలింగ్ శాతం!
[ 16-05-2024]
జిల్లాలో జనగామ, స్టే.ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలున్నాయి. -
కస్తూర్బాల బాట పట్టేలా!
[ 16-05-2024]
అనాథలు, పేదరికంలో మగ్గుతున్న బాలికలకు వసతితో కూడిన ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్వహణ చేపడుతోంది. -
పల్లె ఓటెత్తింది.. పట్టణం పడకేసింది!
[ 16-05-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పల్లెల్లో ఓటాభిషేకం
[ 16-05-2024]
మహబూబాబాద్ లోక్సభ స్థానానికి జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గాల్లో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి జరిగిన రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది -
పల్లెల్లో ఓటోత్సాహం!
[ 16-05-2024]
మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి ములుగు శాసనసభ నియోజకవర్గంలో 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంతమేర పెరిగింది. -
ప్రత్యక్షంగా వండేది లేదు.. దండుకునుడే!
[ 16-05-2024]
రైళ్లలో ఆహార పదార్థాల అమ్మకాలపై కొందరి గుత్తాధిపత్యం కొనసాగుతోంది. -
అంగన్వాడీ టీచర్ దారుణ హత్య
[ 16-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో దారుణం జరిగింది. -
ప్రవర్తనా నియమావళి పాటించాలి
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు. -
గ్రేటర్లో ఇంటి దొంగలు..!
[ 16-05-2024]
గ్రేటర్ వరంగల్లో ఇంటి దొంగల బెడద ఎక్కువైంది. కొందరు అధికారులు పెట్రోల్, డీజిల్ అప్పనంగా సొంత వాహనాలకు వాడుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంజారాహిల్స్లో నాలాపై కుంగిన రోడ్డు.. రాత్రికి వడగళ్ల వర్షం పడే అవకాశం!
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు