logo

Crime news: మద్యం మత్తులో భార్యకు ఉరి వేసిన భర్త

మద్యం మత్తులో ఓ వ్యక్తి.. తన భార్యకు ఉరి వేశాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Updated : 16 Jan 2024 09:34 IST

తాడేపల్లిగూడెం: మద్యం మత్తులో ఓ వ్యక్తి.. తన భార్యకు ఉరి వేశాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పడాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేమ్స్‌, నాగమణి దంపతులు. పిల్లలు ఆడుకునే విషయంపై సోమవారం రాత్రి గొడవపడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న జేమ్స్‌ నాగమణిపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. చనిపోయిందనుకుని భావించి ఫ్యాన్‌కు ఉరివేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడటాన్ని గమనించి వెంటనే కిందికి దించాడు. స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నాగమణి మృతి సమాచారం అందుకున్న పోలీసులు జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని