జగన్ అరాచక పాలనపై ఎన్డీయే తరఫున ఛార్జిషీట్ వేస్తాం: పితాని
అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
కొమ్ముచిక్కాల (పోడూరు), న్యూస్టుడే: అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ గారడి మాటలకు మోసపోకుండా ఆలోచించి అవినీతి రాజ్యాన్ని అంతమొందించేందుకు ప్రజల సహాయాన్ని కోరుతున్నామన్నారు. బీసీ, ఎస్సీ, సోదరులు తెదేపా, జనసేన పార్టీలకు చెందితే అక్రమ కేసులు పెట్టడంతోపాటు ప్రాణాలు తీసిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ఎస్సీ, బీసీల ఉపప్రణాళిక నిధులను మళ్లించి అన్యాయం చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు డ్వాక్రా సిబ్బందితో మహిళలను బలవంతంగా తీసుకువెళ్లి చీర, సారె ఇచ్చి ఓటు వేయకపోతే నా ఉసురు తగులుతుందని దుర్భాషలాడారని వివరించారు. భాజపా నాయకులు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, జనసేన మండల అధ్యక్షుడు బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాను ఓటుతో కొట్టు
[ 11-05-2024]
అధికార వైకాపా వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండి ప్రధాన కూడలిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
అయిదేళ్లూ.. ధరల దండయాత్ర
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల పాటు ధరల దండయాత్ర చేసింది. నిత్యావసరాలు మొదలు ఇంధనం, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు ఇలా అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచింది. -
సైకో పోవాలి.. సైకిల్ రావాలి
[ 11-05-2024]
‘రైతుకు సాగు నీరు అందాలన్నా..గిట్టుబాటు ధర రావాలన్నా..యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా..పోలవరం పూర్తి కావాలన్నా..అమరావతి రాజధాని కావాలన్నా..నిత్యావసరాల ధరలు విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు తగ్గాలన్నా 13న మీరేం చేయాలి’ అంటూ ప్రజలను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. -
మాటలు కోటలు.. జీతాల్లో కోతలు!
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వోద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీ వేతనాలు అందకపోగా... ఇతరత్రా సౌకర్యాలను పొందలేకపోయారు. -
నోట్లకు.. ఓట్లు రాలతాయా?
[ 11-05-2024]
పోలింగ్కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులు ప్రచారాలతో పాటు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బాదుడు
[ 11-05-2024]
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికులను భారీగా బాదేస్తున్నారు. -
మట్టి మాఫియా మళ్లీ బరితెగింపు
[ 11-05-2024]
అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో తలమునకలవుతోంది. ఇదే అదనుగా మట్టి మాఫియా ఆచంట మండలం అనగార్లంక, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బెల్లంపూడి సరిహద్దులో రెండు రోజులుగా విజృంభించింది. -
పోయేది జనం ప్రాణాలేగా?
[ 11-05-2024]
అనుకోని విపత్తులు విరుచుకు పడితే ప్రభుత్వం దన్నుగా నిలబడాలి. నేనున్నానంటూ భరోసానివ్వాలి. వైకాపా సర్కారుకు మాత్రం ఇవేమీ పట్టవు. -
వైద్యం.. ఇదేం దౌర్భాగ్యం
[ 11-05-2024]
అధునాతన వైద్యసేవలను చేరువ చేస్తాం. భీమవరం వాసులకే కాకుండా పరిసర జిల్లాలకు చెందిన వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. -
నమ్మి ఓటేస్తే.. నయవంచన!
[ 11-05-2024]
రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ గత సాధారణ ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని నిరుద్యోగ యువత మండిపడుతోంది. -
భీమవరంలో అమిత్షా పర్యటన రద్దు
[ 11-05-2024]
భీమవరంలో శనివారం జరగాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పర్యటన రద్దయిందని భాజపా క్రమశిక్షణ సంఘం రాష్ట్ర ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. అయిదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
[ 11-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM