ఏటా కొలువులన్నావ్.. కన్నీటినే మిగిల్చావ్..!
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు.
వైకాపా మాయమాటలు..
కల్లలైన యువ కలలు
తాడేపల్లిగూడెం వన్టౌన్,న్యూస్టుడే
‘‘ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఏపీపీఎస్సీని బలోపేతం చేసి, ప్రణాళిక ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తాం. యువతకు బంగారు భవిత అందిస్తాం’’ ఇదీ ఎన్నికలకు ముందు జగన్ పలికిన పలుకులు.
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. నిరుద్యోగుల కలలను ఆవిరి చేస్తూ..సాగిన వైకాపా పాలన పలు కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఏటేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్ తర్వాత దాని ఊసే విస్మరించారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి, మరోసారి మోసం చేయడానికి తెరలేపారని నిరుద్యోగులు దుయ్యపడుతున్నారు.
ఎదురు చూస్తున్నాం
రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ. యువత భవితను వైకాపా ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తీవ్ర అసంతృప్తిలో యువత ఉంది.
నవీన్, మోదుగగుంట
నిర్వీర్యమైన ఐటీ రంగం
ఏటా కొలువులు భర్తీ చేస్తానని అధికారం చేపట్టాక ఇచ్చిన హామీను జగన్ తుంగలో తొక్కారు.ఈయన మాటలు నమ్మిన పలువురు యువత శిక్షణ సంస్థల్లో పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందారు. దీని కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. కనీసం ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసినా కొలువులు దక్కేవి.
విక్రమ్, ఎంసీఏ
ఆశించిన స్థాయిలో కొలువు సాధించలేకపోయా
ఎం.కామ్ చదివా. ఆశించిన స్థాయిలో ఉద్యోగం సాధించలేక పోయాను. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇది సమస్య పరిష్కారానికి తొలిమెట్టు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎందరో నిరీక్షిస్తున్నారు.
బొట్టా త్రినాథ్
పెరిగిన నిరుద్యోగం
ఎంతో నమ్మకంతో జగన్ను గెలిపిస్తే చివరకు యువత ఆశలను సమిధ చేశారు. ఉద్యోగ ప్రకటనలంటూ వంచించారు. కనీసం యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే ఉపాధి అవకాశాలు వచ్చేవి. కొత్త పరిశ్రమలు సైతం రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది.
రవికుమార్, డిగ్రీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందు జాగ్రత్త చర్యలతోనే డెంగీ నివారణ
[ 16-05-2024]
పరిసరాల్లో మురుగు నీటి నిల్వలు లేకుండా శుభ్రత పాటించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా డెంగీ బారి నుంచి రక్షణ పొందవచ్చని బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
కూటమి శ్రేణుల్లో జోష్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పండగ ముగిసింది. నేతల భవితవ్యాలన్నీ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల విడుదలకు జూన్ 4 వరకు సమయం ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. -
26 వరకూ పలు రైళ్ల రద్దు
[ 16-05-2024]
గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 15 నుంచి 26 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
సొమ్ము జమవుతుందా లేదా?
[ 16-05-2024]
సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను పోలింగ్ పూర్తయిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. -
ఎంతకాలం ఈ సంక్షోభ గృహాలు?
[ 16-05-2024]
సంక్షేమ వసతి గృహాలు.. సంక్షోభ వసతి గృహాలుగా మారిపోయాయి. కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, తాగునీరు లేక అవస్థలు విద్యార్థులకు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యంతో వేసవి సెలవుల్లో చేయాల్సిన చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేక అధికారులు చతికిలపడ్డారు. -
సమావేశాలకే దిక్కు లేదు.. సాయమెక్కడ?
[ 16-05-2024]
మన్యంలోని గిరిజనుల సంక్షేమాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుపరిచే ఉద్దేశంతో కేఆర్పురంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలు నామమాత్రంగా మారాయి. సంక్షేమ పథకాల అమలు తీరు మొక్కుబడి తంతును తలపిస్తోంది. -
ఆగని మట్టి అక్రమ రవాణా
[ 16-05-2024]
ఉన్నతాధికారులు కొద్ది రోజులుగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండగా.. క్షేత్ర స్థాయిలో కొంత మంది ఉద్యోగుల సహకారంతో మట్టి మాఫియా బరి తెగించింది. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలింపు సాగిపోతోంది. -
బంతి.. బంతికీ బెట్టింగ్
[ 16-05-2024]
ఈటింగ్.. ప్లేయింగ్.. బ్యాకింగ్త్రీ పదాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు హోరెత్తుతున్నాయి. సామాన్యులకు ఈ పదాలు కొత్తగా అనిపించినా క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనే వారికి ఎంతో సుపరిచితం. -
పైసా విదల్చలేదు!
[ 16-05-2024]
పెనుగొండ మండలం రామన్నపాలెం, నడిపూడి, ఇలపర్రు, ములపర్రు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్తుశాఖ సిబ్బంది 3 నెలలు సరఫరా నిలిపేశారు. -
ప్రేమ వివాహాన్ని కాదన్నారని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించి.. బలవంతంగా తీసుకువెళ్లడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
గోదావరిలో మునిగి ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
వేర్వేరు ప్రాంతాల్లో గోదావరిలో స్నానానికి దిగిన జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన చుక్క బాలాజీ (24) స్థానిక ఏఎస్ఆర్ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. -
13,70,153 మంది ఓటేశారు
[ 16-05-2024]
జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 16,37,430 మంది ఓటర్లు ఉండగా 13,70,153(83.68 శాతం) ఓట్లు పోలయ్యాయి. -
సిబ్బంది చేతివాటంతో టన్నుల కొద్దీ తరలిపోతున్న వైనం
[ 16-05-2024]
అటవీ అభివృద్ధి సంస్థపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు