ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు.
తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు
కరుగోరుమిల్లి తీరంలో ఇసుక రవాణాకు సిద్ధం చేసిన వాహనాలు
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. రెండు పొక్లెయిన్లను నదీ గర్భంలోకి తరలించారు. రవాణాకు అనుకూలంగా తీరంలో పెద్దపెద్ద ఇసుక గుట్టలు పెట్టారు. ఇసుక తరలింపును గ్రామస్థులు అడ్డుకుని మళ్లీ అభ్యంతరం తెలిపారు.
ఆచంట, న్యూస్టుడే
ఆచంట నియోజకవర్గ పరిధిలోని కరుగోరుమిల్లిలో నెల కిందట ఇసుక ర్యాంపునకు అనుమతి వచ్చిందంటూ ఎగుమతులు ప్రారంభించారు. రెండు మూడు రోజులు పొక్లెయిన్లతో లారీల్లో లోడు చేసి తరలించారు. దీనిపై మాజీ మంత్రి పితాని స్పందిస్తూ అవి నకిలీ అనుమతులని ఆరోపించారు. ఇసుక అక్రమ దందా వెనుక వైకాపాతోపాటు స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారని విమర్శించారు.
అడ్డుకున్నా.. ఆగని రవాణా..
అధికార పార్టీ అండదండలు, అధికారుల ఉదాసీనతతో ఉగాది రోజు కరుగోరుమిల్లిలో అక్రమ దందాకు తెర తీశారు. ఆ రోజు తెల్లవారుజామున స్థానికులు రవాణా వాహనాలను అడ్డుకున్నారు. ఏడు ట్రాక్టర్లు, పొక్లెయిన్ నిలిపి వేశారు. వాహనాలు వెళ్తున్న ర్యాంపునకు గండి కొట్టారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రాథమిక సమాచారం సేకరించారు. గ్రామస్థులు పట్టిచ్చిన పొక్లెయిన్లు, ట్రాక్టర్లు సీజ్ చేయలేదు. ఇసుక చోరులపై కేసులు నమోదు కాలేదు. తాజాగా అనుమతులు ఉన్నాయంటూ ఆదివారం ర్యాంపు తెరిచారు.
కరుగోరుమిల్లి ర్యాంపులో ఆదివారం ఉదయం ఇసుక నింపుకొని వస్తున్న లారీ
నిబంధనలు పాటించాల్సిందే..
జిల్లాలో అనుమతులు లేకుండా కొన్నిచోట్ల ఏడాదంతా ఇసుక అక్రమ దందా సాగింది. కరుగోరుమిల్లిలో తవ్వకాలకు ఎన్నికల కోడ్ రాకముందే అనుమతులు లభించాయని చెబుతూ కార్యకలాపాలు మొదలు పెట్టారు. లోడు వాహనాలతో ఏటిగట్టుకు, వంతెనలకు ముప్పు వాటిల్లకూడదనే నిబంధనను తుంగలో తొక్కారు.యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదు.. మీటరు కంటే ఎక్కువ లోతు తీయకూడదు. ఈ ర్యాంపు గురించి ఆచంట తహసీల్దార్ ఐపీ శెట్టిని సంప్రదించగా ఇసుక ర్యాంపునకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఏడీ మైన్స్ ఇన్ఛార్జిని చరవాణిలో సంప్రదించగా స్పందించ లేదు.
దందా ఆగలేదు..
అనుమతులు లేకపోయినా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అక్రమార్కులు ట్రాక్టరు ఇసుకకు రూ.3500 వసూలు చేస్తున్నారు. ఒక్క కరుగోరుమిల్లి గ్రామంలోనే అక్రమ రవాణా ద్వారా కోట్లాది రూపాయలు ఇసుకాసురులు జేబుల్లో వేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు నడిపూడి, సిద్ధాంతంలో కూడా అక్రమంగా తరలించుకుపోయారు. రెండు, మూడు సార్లు స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ కూడా తాత్కాలికంగా రవాణా ఆగింది. నడిపూడిలో కూడా గ్రామస్థులు అడ్డుకోవడమే కాకుండా పంచాయతీలో తీర్మానం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందు జాగ్రత్త చర్యలతోనే డెంగీ నివారణ
[ 16-05-2024]
పరిసరాల్లో మురుగు నీటి నిల్వలు లేకుండా శుభ్రత పాటించడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా డెంగీ బారి నుంచి రక్షణ పొందవచ్చని బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. -
కూటమి శ్రేణుల్లో జోష్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పండగ ముగిసింది. నేతల భవితవ్యాలన్నీ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల విడుదలకు జూన్ 4 వరకు సమయం ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. -
26 వరకూ పలు రైళ్ల రద్దు
[ 16-05-2024]
గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 15 నుంచి 26 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
సొమ్ము జమవుతుందా లేదా?
[ 16-05-2024]
సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను పోలింగ్ పూర్తయిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. -
ఎంతకాలం ఈ సంక్షోభ గృహాలు?
[ 16-05-2024]
సంక్షేమ వసతి గృహాలు.. సంక్షోభ వసతి గృహాలుగా మారిపోయాయి. కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, తాగునీరు లేక అవస్థలు విద్యార్థులకు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యంతో వేసవి సెలవుల్లో చేయాల్సిన చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేక అధికారులు చతికిలపడ్డారు. -
సమావేశాలకే దిక్కు లేదు.. సాయమెక్కడ?
[ 16-05-2024]
మన్యంలోని గిరిజనుల సంక్షేమాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుపరిచే ఉద్దేశంతో కేఆర్పురంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలు నామమాత్రంగా మారాయి. సంక్షేమ పథకాల అమలు తీరు మొక్కుబడి తంతును తలపిస్తోంది. -
ఆగని మట్టి అక్రమ రవాణా
[ 16-05-2024]
ఉన్నతాధికారులు కొద్ది రోజులుగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండగా.. క్షేత్ర స్థాయిలో కొంత మంది ఉద్యోగుల సహకారంతో మట్టి మాఫియా బరి తెగించింది. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలింపు సాగిపోతోంది. -
బంతి.. బంతికీ బెట్టింగ్
[ 16-05-2024]
ఈటింగ్.. ప్లేయింగ్.. బ్యాకింగ్త్రీ పదాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు హోరెత్తుతున్నాయి. సామాన్యులకు ఈ పదాలు కొత్తగా అనిపించినా క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనే వారికి ఎంతో సుపరిచితం. -
పైసా విదల్చలేదు!
[ 16-05-2024]
పెనుగొండ మండలం రామన్నపాలెం, నడిపూడి, ఇలపర్రు, ములపర్రు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్తుశాఖ సిబ్బంది 3 నెలలు సరఫరా నిలిపేశారు. -
ప్రేమ వివాహాన్ని కాదన్నారని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించి.. బలవంతంగా తీసుకువెళ్లడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
గోదావరిలో మునిగి ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
వేర్వేరు ప్రాంతాల్లో గోదావరిలో స్నానానికి దిగిన జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన చుక్క బాలాజీ (24) స్థానిక ఏఎస్ఆర్ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. -
13,70,153 మంది ఓటేశారు
[ 16-05-2024]
జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 16,37,430 మంది ఓటర్లు ఉండగా 13,70,153(83.68 శాతం) ఓట్లు పోలయ్యాయి. -
సిబ్బంది చేతివాటంతో టన్నుల కొద్దీ తరలిపోతున్న వైనం
[ 16-05-2024]
అటవీ అభివృద్ధి సంస్థపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
బంజారాహిల్స్లో నాలాపై కుంగిన రోడ్డు.. రాత్రికి వడగళ్ల వర్షం పడే అవకాశం!
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!