ఆదుకోమంటే బాదేశారు
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది.
జగన్ సర్కారులో..రవాణా రంగం కుదేలు
త్రైమాసిక, గ్రీన్ ట్యాక్స్లు భారీగా పెంపు
పాలకొల్లు పట్టణం, ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే
పాలకొల్లు స్టాండ్లో లారీలు
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. తమను ఆదుకోవాలని వాహన యజమానులు ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి అధిక పన్నులు వసూలు చేయడం సరికాదని లారీ డ్రైవర్లు, యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో లారీ యజమానులు కట్టే హరిత పన్ను రూ.300ను జగన్ ప్రభుత్వం పది రెట్లు పెంచేసింది. సరకు రవాణా లారీలకు ఏడేళ్ల తర్వాత మాత్రమే గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. కాలం చెల్లుతున్న వాహనాల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం ఈ పన్ను విధించే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న జగన్ సర్కారు గత ప్రభుత్వ హయాంలో కట్టే గ్రీన్ ట్యాక్స్ రూ.200ని అమాంతం రూ.26,800కి పెంచేసింది. త్రైమాసిక పన్ను కూడా 20 నుంచి 30 శాతానికి పెంచేసింది. అదే పొరుగు రాష్ట్రాల్లో గ్రీన్ ట్యాక్స్ కర్ణాటకలో రూ.200, తెలంగాణాలో రూ.500, తమిళనాడులో రూ.500 వసూలు చేస్తున్నాయి.
రూ.6 కోట్ల అదనపు భారం
ఉమ్మడి జిల్లా రైతులు వరితో పాటు ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తుంటారు. చేపల ఉత్పత్తులూ ఇక్కడి నుంచి ఎక్కువగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. గత ఏడాది జగన్ ప్రభుత్వం త్రైమాసిక పన్ను 20 నుంచి 30 శాతం వరకు పెంచింది. తద్వారా ఈ రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.59 కోట్ల ఆదాయం వచ్చింది. పన్నుల పెంపుతో జిల్లాలోని అన్ని రకాల రవాణా వాహనాలపై ఏటా దాదాపు రూ.6 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా. దీనికితోడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో గగ్గోలు పెడుతున్నారు.
ఎంత చెల్లించాలంటే..
- 7 - 10 ఏళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువలో సగం చెల్లించాలి. అంటే లారీని బట్టి రూ.2,485 నుంచి రూ.6,715 మధ్య చెల్లించాల్సి ఉంటుంది.
- 10 - 12 ఏళ్లలోపు ఉన్న వాహనాలకు త్రైమాసిక పన్ను చెల్లించాలి. ఈ లెక్కన రూ.4,970 - రూ.13,430 వరకు కట్టాలి.
- 12 ఏళ్లు దాటిన వాటికి రెండో త్రైమాసిక పన్నును హరిత పన్నుగా చెల్లించాలి. అంటే రూ.9,940 - రూ.26,860 మేర చెల్లించాలి.
ఒకప్పుడు యజమానిని
గత ప్రభుత్వ కాలంలో లారీకి యజమానిని. వైకాపా ప్రభుత్వం డ్రైవర్గా మార్చింది. అధిక పన్నులు కారణంగా లారీ నడపలేక అపరాధరుసుంలు కట్టలేక, సరైన పనులు లేక ఉన్న ఒక్కలారీని అమ్మేశా. వేరొకరి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. అది కూడా నెలలో 10 నుంచి 15 రోజులు మాత్రమే పని ఉంటుంది.
బి.యోహనరావు, డ్రైవర్, పాలకొల్లు.
లారీలు తుప్పు పడుతున్నాయి
పనులు లేక లారీలు స్టాండ్లో నిలపడంతో తుప్పు పడుతున్నాయి. బ్యాటరీలు కూడా డిశ్చార్జ్ అవుతున్నాయి. చిన్నపాటి కిరాయికి కూడా ఆటో డ్రైవర్ల మాదిరిగా పోటీపడి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కోలారీకి నెలకు రూ.10వేలు ఎదురు పెట్టుబడి పెడుతున్నాం. దీనికితోడు ఉత్పత్తులు, కిరాయిలు కూడా తగ్గాయి. రైల్వే వ్యాగిన్లు వచ్చినప్పుడు మాత్రమే లారీలకు పని ఉంటుంది. ఆ తరువాత స్టాండ్లోనే నిలిపి ఉంచాల్సిన పరిస్థితి నెలకుంది.
దుగ్గిన రాము, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, పాలకొల్లు .
ఉమ్మడి జిల్లాలో రవాణా వాహనాల సంఖ్య : 40 వేలు
ఆధారపడిన కుటుంబాలు (ప్రత్యక్షంగా, పరోక్షంగా): 4.50 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి శ్రేణుల్లో జోష్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పండగ ముగిసింది. నేతల భవితవ్యాలన్నీ స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల విడుదలకు జూన్ 4 వరకు సమయం ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. -
26 వరకూ పలు రైళ్ల రద్దు
[ 16-05-2024]
గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 15 నుంచి 26 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
సొమ్ము జమవుతుందా లేదా?
[ 16-05-2024]
సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను పోలింగ్ పూర్తయిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. -
ఎంతకాలం ఈ సంక్షోభ గృహాలు?
[ 16-05-2024]
సంక్షేమ వసతి గృహాలు.. సంక్షోభ వసతి గృహాలుగా మారిపోయాయి. కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, తాగునీరు లేక అవస్థలు విద్యార్థులకు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యంతో వేసవి సెలవుల్లో చేయాల్సిన చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేక అధికారులు చతికిలపడ్డారు. -
సమావేశాలకే దిక్కు లేదు.. సాయమెక్కడ?
[ 16-05-2024]
మన్యంలోని గిరిజనుల సంక్షేమాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుపరిచే ఉద్దేశంతో కేఆర్పురంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలు నామమాత్రంగా మారాయి. సంక్షేమ పథకాల అమలు తీరు మొక్కుబడి తంతును తలపిస్తోంది. -
ఆగని మట్టి అక్రమ రవాణా
[ 16-05-2024]
ఉన్నతాధికారులు కొద్ది రోజులుగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండగా.. క్షేత్ర స్థాయిలో కొంత మంది ఉద్యోగుల సహకారంతో మట్టి మాఫియా బరి తెగించింది. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలింపు సాగిపోతోంది. -
బంతి.. బంతికీ బెట్టింగ్
[ 16-05-2024]
ఈటింగ్.. ప్లేయింగ్.. బ్యాకింగ్త్రీ పదాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు హోరెత్తుతున్నాయి. సామాన్యులకు ఈ పదాలు కొత్తగా అనిపించినా క్రికెట్ బెట్టింగ్లో పాల్గొనే వారికి ఎంతో సుపరిచితం. -
పైసా విదల్చలేదు!
[ 16-05-2024]
పెనుగొండ మండలం రామన్నపాలెం, నడిపూడి, ఇలపర్రు, ములపర్రు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు విద్యుత్తు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్తుశాఖ సిబ్బంది 3 నెలలు సరఫరా నిలిపేశారు. -
ప్రేమ వివాహాన్ని కాదన్నారని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించి.. బలవంతంగా తీసుకువెళ్లడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
గోదావరిలో మునిగి ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
వేర్వేరు ప్రాంతాల్లో గోదావరిలో స్నానానికి దిగిన జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన చుక్క బాలాజీ (24) స్థానిక ఏఎస్ఆర్ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. -
13,70,153 మంది ఓటేశారు
[ 16-05-2024]
జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం నమోదైంది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 16,37,430 మంది ఓటర్లు ఉండగా 13,70,153(83.68 శాతం) ఓట్లు పోలయ్యాయి. -
సిబ్బంది చేతివాటంతో టన్నుల కొద్దీ తరలిపోతున్న వైనం
[ 16-05-2024]
అటవీ అభివృద్ధి సంస్థపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్