logo

ఓటర్లకు బిర్యానీ గాలం

ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్‌, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 02 May 2024 05:47 IST

ఎన్నికల నిబంధనలకు తూట్లు

 ఆచంట కోనపోతుగుంటలో చికెన్‌ బిర్యానీ పంపిణీ

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్‌, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక్కో ప్రాంతంలో 800 నుంచి 1000 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా ప్రాంతాలకు బుధవారం రాత్రి మినీ లారీల్లో ఆహార పదార్థాలు తరలించారు. గుడినో బడినో కేంద్రంగా చేసుకుని బీసీ వాడలకు ప్లేటు నిండా వేడివేడి బిర్యానీ, చికెన్‌ కూరతో ఓటర్లకు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు