logo

minister Parthasarathy: వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరు అమోఘం : మంత్రి కొలుసు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 13 Sep 2024 18:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయవాడ : వరదల నుంచి ప్రజలను బయటపడేయాలని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కనబరిచిన పని తీరు అమోఘమని మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు. ఇప్పుడిదే  దేశ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది నేషన్ అయిందన్నారు. విజయవాడ కృష్ణలంకలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి మంత్రి పర్యటించారు. 21వ డివిజన్‌లో వరద బాధితులను  పరామర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సీఎం చంద్రబాబుతో సహా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులందరూ వరదలోనే ఉండి బాధితులకు సేవలందించారని మంత్రి తెలిపారు. వరదలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బాధితులకు ఆహారం, పాలు, బిస్కెట్లు అందిస్తున్నామని చెప్పారు. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. వరద బాధితులందరికీ  నష్ట పరిహారం అందిస్తామని వెల్లడించారు.  వరద బాధితులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా  కృషి చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని  మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు