Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైకాపా నేతలకు తెలియదు: నిమ్మల

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా, ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ ఇరిగేషన్ శాఖలోనే రూ.18వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టి వెళ్లారని, గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే.. కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు.
‘‘అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైకాపా నేతలకు తెలియదు. దానిపై వారికి అవగాహన కూడా లేదు. గతంలో చంద్రబాబు రూ.430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశాడు. రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టాం. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 20 నాటికి 202 మీటర్లకుపైగా వాల్ నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఏప్రిల్ 30 కల్లా మూడో కట్టర్ అందుబాటులోకి వస్తుంది. వర్షాకాలంలో సైతం పనులు జరిగేలా, ఎగువ కాపర్ డ్యామ్ను బలోపేతం చేయడానికి బట్రస్ డ్యామ్ మే నెలకల్లా పూర్తి చేస్తాం. డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా.. సమాంతరంగా గ్యాప్-1 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని ఏప్రిల్లో మొదలుపెట్టాం. గ్యాప్-2 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఈ ఏడాది నవంబర్ 30లోగా మొదలుపెట్టేలా సీఎం చంద్రబాబు ప్రణాళికను అమలు చేస్తాం’’అని మంత్రి నిమ్మల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                తరగతి గదిలోనే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
[ 04-11-2025]
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. - 
                            
                                
                                ఆర్టీసీ బస్సులు నిలపాలంటూ కళాశాల విద్యార్థుల నిరసన
[ 04-11-2025]
ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. - 
                            
                                
                                గోదావరి తీరం.. అఖండ దీపం..
[ 04-11-2025]
శివుడి తలపై నుంచి భువికి దిగిన దక్షిణ గంగ.. గోదావరి కెరటాల ఝరిలో...బంగారు కాంతులీనుతున్న కార్తిక దీపాల వెలుగుల్లో రాజమహేంద్రవరం మెరిసింది. - 
                            
                                
                                వైద్యం ఆధునికం..సేవలు ఉచితం
[ 04-11-2025]
పేద, మధ్య తరగతి ప్రజలకు అనారోగ్యం వచ్చిందంటే తల్లడిల్లాల్సిందే. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఫీజులు, వైద్య పరీక్షలకు వేలాది రూపాయలు వసూలు చేస్తారు. - 
                            
                                
                                నీళ్లు రావాలంటే నిధులు పారాలి!
[ 04-11-2025]
ప్రతి ఇంటికీ రక్షిత నీటి కుళాయి, రోజుకు తలసరి 55 లీటర్ల నీటి సరఫరా జల్జీవన్ మిషన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేయలేకపోయింది. - 
                            
                                
                                వెన్నుతట్టే విజయం..బ్యాటుపట్టే సమయం
[ 04-11-2025]
ఒక విజయం లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఉజ్వల భవితకు బాటలు వేస్తుంది. కొత్త అవకాశాలను చెంతకు చేర్చుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చేస్తుంది. - 
                            
                                
                                ఉపాధికి వరదపోటు
[ 04-11-2025]
సాధారణంగా గోదావరిలో మత్స్యకారులు జూన్ నుంచి సెప్టెంబరు వరకు మత్స్యసంపద వేటాడేందుకు వీలుపడదు. ప్రస్తుతం వరదల సీజన్ కావడంతో ఎర్రనీరు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తోంది - 
                            
                                
                                అనుమానించాడని.. చున్నీ మెడకు బిగించి హత్య..!
[ 04-11-2025]
తనను అనుమానించిన వ్యక్తి మెడకు ఓ మహిళ చున్నీ బిగించి హత్య చేసిన ఘటన రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


