logo

Kolusu Parthasarathy: నాణ్యత లేని ఇళ్ల స్థానంలో కొత్త నిర్మాణాలు : మంత్రి కొలుసు పార్థసారథి

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 19 Sep 2024 18:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి : ఏపీ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న హౌసింగ్ కాలనీలోని ఇళ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గుంటూరు జిల్లా పేరేచర్ల హౌసింగ్ కాలనీలో ఉన్న లేఅవుట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పేరేచర్ల హౌసింగ్ కాలనీలో మొత్తం 18వేలకు గాను 11వేల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణ వేశారన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున గుత్తేదారులకు పూర్తి సహకారం అందిస్తామని, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. 2025 మార్చి దాటితే లబ్ధిదారులకు బ్యాంకు రుణం వచ్చే పరిస్థితి ఉండదన్నారు. హౌసింగ్ కాలనీల్లో విద్యుత్తు, రహదారులు, తాగునీరు ఇలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యత లేకుండా నిర్మించిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. 

Tags :
Published : 19 Sep 2024 18:28 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు