Hydra NOC: హైడ్రాలో దరఖాస్తు విధానంతో తిప్పలు.. ఎన్వోసీ కావాలంటే కాళ్లరగాల్సిందే!
ఈనాడు- హైదరాబాద్

వాణిజ్య భవనాలను ఎన్వోసీ(నిరభ్యంతర పత్రం) కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు జీహెచ్ఎంసీలో అగ్నిమాపక విభాగం ఉండేది. 15మీటర్ల ఎత్తు వరకుండే భవనాలకు ఎన్వోసీల జారీ అక్కడే జరిగేది. హైడ్రా ఏర్పాటుతో.. జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం అందులోకి వెళ్లింది. ప్రస్తుతం హైడ్రానే ఈ ధ్రువీకరణ ఇస్తోంది.
దరఖాస్తు చేయడం నుంచే..
నిర్మాణ అనుమతి దరఖాస్తులన్నీ కొన్నేళ్లుగా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ, డీటీసీపీ అధికారులు ఆన్లైన్లో సరిచూసుకుని, నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాలు అందజేస్తున్నారు. హైడ్రా (Hydra) వద్ద ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ క్లిష్టతరంగా ఉందంటున్నారు. కార్యాలయానికి వెళ్లి రిసెప్షన్లో అభ్యర్థిస్తే.. అక్కడుండే సిబ్బంది అధికారులకు ఫోన్ చేసి, వారు అనుమతించాకే దరఖాస్తుదారులకు పత్రాలు ఇస్తారు. బ్యాంకులో చలానా కట్టి, పత్రాల్లో వివరాలన్నీ నింపి మళ్లీ అదే సిబ్బందికి దరఖాస్తు అందజేయాలి. దాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించాక.. ఈ-ఆఫీసులో దస్త్రం సంబంధిత అధికారులకు వెళ్తుంది. ఈ ప్రక్రియలో అడుగడుగునా జాప్యంతో, నెలల పాటు ఎన్వోసీలు జారీ కావట్లేదని పలువురు వాపోతున్నారు. భౌతికంగా దరఖాస్తు విధానం, జాప్యం అవకతవకలకు తావిస్తోందన్న ఆరోపణలున్నాయి.
వారికి ఎన్వోసీలే ఇవ్వట్లేదు..
మూడు, నాలుగు అంతస్తుల భవనాలను నిర్మించేప్పుడు చాలామంది ఇంటి కేటగిరీలో అనుమతి తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలు, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపారకేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఇలాంటి భవనాలు.. వినియోగం మారగానే ఫైర్ ఎన్వోసీ కోసం హైడ్రాను సంప్రదిస్తున్నారు. అలాంటి వాటికి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన రూబి హోటల్, డెక్కన్మాల్ ఆ కోవలేనివే కావడం గమనార్హం.
ఒకరికే అన్నింటి పరిధి..
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. అన్ని రకాల ఎన్వోసీల జారీ అధికారాన్ని రాష్ట్ర అగ్నిమాపక శాఖకు అప్పగించాలని, లేదంటే అనుమతి ఇచ్చే సంస్థల పరిధిలో ఆ శాఖ అధికారులను నియమించి.. ఒకే దరఖాస్తు ద్వారా అన్ని అనుమతులు వచ్చేలా విధానాన్ని మార్చాలని నిర్మాణదారులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                వికారాబాద్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
[ 04-11-2025]
చేవెళ్ల ఘటనను మరువక ముందే.. వికారాబాద్ జిల్లా తాండూర్ వద్ద మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. - 
                            
                                
                                రోడ్డును బాగు చేయండి.. ప్రజల నిరసన
[ 04-11-2025]
వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు తాండూరు డెవలప్మెంట్ పేరిట ధర్నాకు దిగారు. - 
                            
                                
                                డివైడర్ను ఢీ కొన్నకారు.. దంపతులకు గాయాలు
[ 04-11-2025]
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో వృద్ధ దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. - 
                            
                                
                                ఉన్నత విద్యామండలి కార్యాలయ ముట్టడికి యత్నం
[ 04-11-2025]
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. - 
                            
                                
                                ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఇచ్చిన స్పీకర్
[ 04-11-2025]
భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. - 
                            
                                
                                హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. - 
                            
                                
                                గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


