logo

Kavitha: సామాజిక తెలంగాణ కోసం కలిసి పని చేద్దాం: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Published : 24 Sep 2025 15:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి పనిచేసి విజయం సాధించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ‘‘ఆత్మ గౌరవంతో కూడిన తెలంగాణ కోసం పనిచేద్దాం. పునరేకీకరణ కోసం కలిసి పోరాటం చేయాలి. రాష్ట్రంలో పేదల వైపు ఉండి పోరాడుతాం. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నా. జాగృతిలో ఇప్పటికే ఉన్న నాయకత్వంతో పాటు.. చేరుతున్న కొత్త వారికి సముచిత స్థానం కల్పిస్తాం. కుత్బుల్లాపూర్‌లో హైడ్రా బాధితులైన పేదల పక్షాన పోరాటం చేస్తాం. భవిష్యత్తులోనూ పేద ప్రజల కోసం పోరాటాలు కొనసాగిస్తాం’’ అని కవిత తెలిపారు. (Telangana News)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని