logo

Uttam Kumar Reddy: కాళేశ్వరం డిజైన్‌, నిర్మాణంలో తీవ్ర లోపాలు: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 26 Mar 2025 15:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ అంశంలో విజిలెన్స్‌ నివేదిక వచ్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టిసారిస్తామన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు లేవలెత్తిన అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ఆనకట్టల డిజైన్‌, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డీపీఆర్‌లో షీట్‌ పైల్స్‌ ఉంటే.. నిర్మాణంలో సీకెంట్‌ పైల్స్‌ వాడారని చెప్పారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం దురదృష్టకరమని.. ప్రపంచస్థాయి నిపుణులను భాగస్వామ్యం చేసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన 3 గంటల్లోపే తాను అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌ కూడా రెండు రోజుల క్రితం దీనిపై సమీక్షించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారన్నారు. సొరంగ ప్రమాదం తాత్కాలికంగా వచ్చిన ఎదురుదెబ్బ మాత్రమేనని.. ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. 

తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. వీలైనంత త్వరగా పనులు చేపడతామన్నారు. తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరాకు శ్రీకారం చుడుతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని