logo

Devadula Project: 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 30 Aug 2024 14:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కన్నాయిగూడెం: 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్‌ స్టేషన్‌ను వారు సందర్శించారు. ప్రాజెక్టు ఇంటెక్‌వెల్‌, పంప్‌ హౌస్‌ను పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో రూ.కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును భారాస ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. దేవాదుల ద్వారా 300 రోజులుగా 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోశామన్నారు. నీటి పారుదల శాఖలో పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లిస్తామని తెలిపారు.

భారాస పాలనలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

Tags :
Published : 30 Aug 2024 12:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని