Chandrababu: గత పాలకుల అహంభావంతో పోలవరానికి తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబు

పోలవరం: గత పాలకుల అహంభావం, తెలియనితనం, రాజకీయ వివక్షతో పోలవరం ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. గోదావరి జలాల్లో 2 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని, అందులో 400 టీఎంసీలను వాడుకుంటే ఏపీని కరవు రహితం చేయవచ్చని అన్నారు. దీని కోసం ప్రాజెక్టు కట్టాలని 1941లోనే ప్రణాళికలు సిద్ధమయ్యాయని, అప్పుడు కట్టలేక ధవళేశ్వరం బ్యారేజీ కట్టారని గుర్తు చేశారు. గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడటానికి జూన్ 2 డెడ్లైన్గా ఉంది. ఏడు మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తికాదు. జూన్ 2 దాటితే రెండు రాష్ట్రాలు బిల్లును ఆమోదించాలి. ఆ ఏడు మండలాలను ఏపీకి ఇవ్వడం ప్రాజెక్టుకు దోహదమైంది. ప్రాజెక్టును పూర్తి చేయగలమనే ధీమాతో ముందుకెళ్లాం. పోలవరం ప్రాజెక్టును 73 శాతం పూర్తి చేశాం. పోలవరంపై 82 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ప్రాజెక్టు ఆలస్యమవుతుందని పట్టిసీమ నిర్మాణం చేపట్టాం. ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా వేగవంతం చేశాం. వైకాపా హయాంలో జరిగిన తప్పు.. చరిత్ర క్షమించరాని నేరం. జాతీయ ప్రాజెక్టు, ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు.
గతంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. కాఫర్డ్యామ్ సకాలంలో పని చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఊహించని నష్టం జరిగింది. ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. పీపీఏ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకసారి ఓట్లేసినందుకు రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు. పోలవరం విషయంలో నిపుణుల కమిటీ పరిశీలించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయ కక్షలతో రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టుపై కక్ష తీర్చుకున్నారు. డయాఫ్రమ్వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతోంది. 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 డిసెంబర్కు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడింది’’ అని చంద్రబాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని
[ 04-11-2025]
పోలవరంలోని ప్రైవేటు పాఠశాల విద్యార్థిని ముదునూరి శ్రీహిత పూళ్లగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో సత్తాచాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ థెరీసమ్మాజాన్ చెప్పారు. - 
                            
                                
                                పొలం దున్నుతుండగా విద్యుదాఘాతం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి
[ 04-11-2025]
బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెంలో పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా విద్యుత్తు తీగలకు తగిలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. - 
                            
                                
                                రైతులను కలిసే అర్హత జగన్కు లేదు: మంత్రి నిమ్మల
[ 04-11-2025]
పాలకొల్లులోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. - 
                            
                                
                                ఎస్జీఎఫ్ ఆటల పోటీలు ప్రారంభం
[ 04-11-2025]
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి రగ్బీ, అథ్లెటిక్ పోటీలు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. - 
                            
                                
                                అభయాంజనేయ స్వామికి లక్ష బిల్వార్చన పూజలు
[ 04-11-2025]
జీలుగుమిల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తికమాస మహోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష బిల్వార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. - 
                            
                                
                                మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
[ 04-11-2025]
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తిక మంగళవారం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. - 
                            
                                
                                రండి.. పరిశ్రమించండి!
[ 04-11-2025]
వైకాపా ప్రభుత్వం అటకెక్కించిన పరిశ్రమల అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. - 
                            
                                
                                నేడు ‘ఈటీవీ’ కార్తిక దీపోత్సవం
[ 04-11-2025]
శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది కార్తిక మాసం. దీంతో సమానమైన మాసం, గంగతో సమానమైన తీర్థం లేదని పురాణోక్తి. - 
                            
                                
                                ఆశలకు ఆయువునిచ్చారు.. ఆటలకు బాటలేశారు!
[ 04-11-2025]
భారత మహిళా క్రికెటర్లు తమ ఆశలకు ఆయువునిచ్చారు. ఇకపై మరింత ముమ్మరంగా ఆటలాడేందుకు బాటలేశారు. తమ భవిష్యత్తుకు కొంగొత్త ధీమానిచ్చారు. - 
                            
                                
                                కార్మికునికో కార్డు
[ 04-11-2025]
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-శ్రమ్ పోర్టల్లో ఉచిత నమోదుకు అవకాశం కల్పించాయి. - 
                            
                                
                                పంచారామం చెంతనే.. త్రిలింగ క్షేత్రాలు
[ 04-11-2025]
త్రిలింగ క్షేత్రాలుగా అలరారుతున్న శివదేవుని చిక్కాల, దిగమర్రు శివాలయాలు పంచారామ క్షేత్రం పాలకొల్లుకు సమీపాన ఉన్నాయి. - 
                            
                                
                                ఆభరణాల చోరీ ముఠా అరెస్టు
[ 04-11-2025]
ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ముఠాను అరెస్టు చేసి బంగారు నగలు, వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీంఅస్మి తెలిపారు. - 
                            
                                
                                స్త్రీనిధి రుణ చెల్లింపుల్లో గోల్మాల్ చేయలేరిక!
[ 04-11-2025]
స్త్రీనిధి నుంచి తీసుకున్న రుణంలో సభ్యులు చెల్లించిన వాయిదా మొత్తంలో సగం కట్టి మిగతా సగం ఇతర వాటికి వినియోగించుకోవడం.. ఒకరు చెల్లించిన మొత్తాన్ని మరొకరి పేరు మీద జమ చేయడం. - 
                            
                                
                                డిజిటల్ అరెస్టులో ఉండగానే నిందితుడి పట్టివేత
[ 04-11-2025]
జిల్లాకు చెందిన మహిళా న్యాయవాది డిజిటల్ అరెస్టు ఉదంతం సంచలనమైంది. ఈ కేసులో ఆమె డిజిటల్ అరెస్టులో ఉండగానే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఓ నిందితుడిని పట్టుకున్నారు. - 
                            
                                
                                అంతు లేని బాగోతాలు
[ 04-11-2025]
స్థలం ధరకు మించి రుణాలు ఇవ్వటం, వాటి చెల్లింపునకు ఓటీఎస్ సౌకర్యం కల్పించటంతో ఆర్థికంగా సహకార బ్యాంకులకు నష్టం వాటిల్లింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


