Kavitha: ఎమ్మెల్సీ కవితకు 9 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ

మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

Updated : 15 Apr 2024 10:53 IST

దిల్లీ: మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతించింది. 

భాజపా నేతలు మాట్లాడేదే సీబీఐ అడుగుతోంది: కవిత

ఇది సీబీఐ కస్టడీ కాదని.. భాజపా కస్టడీ అని కవిత విమర్శించారు. బయట భాజపా నేతలు మాట్లాడేదే.. లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి అడిగిందే.. అడుగుతున్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని