Vizag: విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 మంది వైకాపా బీఎల్‌ఏలపై కేసు

నగరంలో ఓట్ల అక్రమాలపై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.

Published : 23 Feb 2024 18:41 IST

విశాఖపట్నం: నగరంలో ఓట్ల అక్రమాలపై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబరు 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొన్ని ఓట్లు తొలగించాలని దాదాపు 163 మంది ఒకటికి మించి ఫారం-7లు దాఖలు చేశారు. దాదాపు 5 వేల ఓట్లు రద్దు చేయాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించాలని ఈఆర్వోపై ఒత్తిడి తెచ్చారు. వైకాపా నాయకులే ఓట్లు తొలగించినట్టు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలనలో వెల్లడైంది. వైకాపాకు చెందిన 10 మంది బీఎల్‌ఏలు నిబంధనలు ఉల్లంఘించి ఫారం-7లు సమర్పించినట్టు రిటర్నింగ్‌ అధికారి నిర్ధరించారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నాలుగు పోలీస్‌స్టేషన్లలో 10 మంది వైకాపా బీఎల్‌ఏలపై కేసు నమోదైంది. వీరిలో కొందరు వైకాపా పశ్చిమ ఇన్‌ఛార్జి అడారి ఆనంద్‌ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని