Ts Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 29 Nov 2023 20:03 IST

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు అర్జిత సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఉద్యోగులకు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఓటు ఉన్నట్టు ఓటరు కార్డు చూపితే ఆర్జిత సెలవు వర్తిస్తుందని ఆదేశాల్ల్లో పేర్కొన్నారు. తెలంగాణలో నవంబరు 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు