War: ‘చురు’ యుద్ధంలో వెండి ఫిరంగి గుండ్లు
(Photo: tourism-rajasthan.com)
ఇంటర్నెట్ డెస్క్: రాజుల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో గెలిచిన రాజులు.. ఓడిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు. అందుకే ఎవరైనా దండెత్తి వస్తే, ఏ రాజైనా చివరి నిమిషం వరకు తన రాజ్యాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నించేవారు. ఈ క్రమంలోనే యుద్ధాల్లో సైనికులు ఇనుము, రాగి, ఇత్తడితో చేసిన ఫిరంగి గుండ్లను ప్రయోగించారని చరిత్రలో చదివాం.. సినిమాల్లో చూశాం. కానీ, ఓ రాజు ఫిరంగుల కోసం ఇనుప గుండ్లకు బదులు వెండి గుండ్లను ఉపయోగించాడట. ఆశ్చర్యంగా ఉంది కదా..! అయితే ఆ కథేంటో తెలుసుకుందాం!
రాజస్థాన్లోని చురు జిల్లాలో ఉన్న చురు కోటను 1694లో ఠాకూర్ కుశాల్ సింగ్ అనే చక్రవర్తి నిర్మించాడు. అప్పటి చురు రాజ్యంలోకి శత్రువులెవరూ ప్రవేశించకుండా రాజ్యానికి ముందుభాగంలో ఈ కోటను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దాడు. ఆయన మరణానంతరం అతడి వారసులు రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అయితే, వెండి ఫిరంగి గుండ్ల ఘటన 1814లో చోటుచేసుకుంది. అప్పుడు చురు రాజ్యానికి ఠాకూర్ శివాజీ సింగ్ చక్రవర్తి. ఆ ఏడాది ఆగస్టులో పొరుగున ఉన్న బికనేర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సూరత్ సింగ్.. చురు కోటపై దండెత్తి వచ్చాడు. దీంతో ఇరు రాజ్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. చురు రాజ్యంలోని యువకులు సైతం యుద్ధంలో పాల్గొని ప్రభుభక్తిని చాటుకున్నారు.
అయితే, కొన్ని రోజులకు చురు సైనికుల వద్ద ఆయుధాలు నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. చక్రవర్తికి ఓ ఆలోచన వచ్చింది. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే యుద్ధంలో గెలవాల్సిందేనని, ఇందుకోసం ఆయుధాలు కావాలంటే ప్రజలు తమ బంగారు, వెండి ఆభరణాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. దీంతో ప్రజలంతా ఏకతాటిపై నిలబడి తమ వద్ద ఉన్న ఆభరణాలను దానం చేశారు. అలా సేకరించిన వెండి ఆభరణాలను కరిగించి ఫిరంగు గుండ్లు తయారు చేయాలని శివాజీ సింగ్ సైనికులను ఆదేశించాడు. ఒకవైపు వెండి ఫిరంగి గుండ్లను తయారు చేస్తూ.. మరోవైపు వాటిని శత్రుసైన్యంపైకి ప్రయోగించారు. చివరికి ఈ యుద్ధంలో శివాజీ సింగ్ చక్రవర్తే విజయం సాధించి.. తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు. చరిత్రలో ఏ రాజూ ఇలా వెండి ఫిరంగి గుండ్లను ఉపయోగించలేదని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: షారుఖ్ సూపర్హిట్ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
ఇదొక ‘లంచం.. మంచం ప్రభుత్వం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్సింగ్ ఇంటికి పోలీసులు!
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు