Hyderabad: 9 ఇనుప మేకులు మింగిన ఖైదీ.. ప్రాణాలు కాపాడిన వైద్యులు

రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న యువకుడు ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన చర్లపల్లి జైల్లో జరిగింది. 

Updated : 20 Apr 2024 21:59 IST

హైదరాబాద్‌: రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న యువకుడు ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన చర్లపల్లి జైల్లో జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖైదీని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. వివరాల్లో వెళితే. చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మహ్మద్‌ షేక్‌ (32) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జైలు వైద్యుల సూచన మేరకు నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రి ప్రిజనర్స్‌ వార్డులో చేర్పించారు.

ఖైదీ కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్టు పలు రకాల వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలో తేలింది. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలో శనివారం పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను బటయకు తీశారు. ఛాలెంజ్‌గా తీసుకొని రోగి కడుపులోని మేకులను బయటకు తీశామని, ఏమాత్రం అజాగ్రత్త జరిగినా ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని