Kakinada: కాకినాడలో దారుణం.. విద్యార్థినుల జడలు కత్తిరించిన ఉపాధ్యాయురాలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటన కలకలం రేపింది.

Updated : 20 Sep 2023 19:53 IST

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటన కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సూర్యనారాయణపురంలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు మంగాదేవి.. విద్యార్థినుల వ్యక్తిగత శుభ్రత, వస్త్రధారణ విషయంలో కఠినంగా వ్యహరించారు. 

టీచరు మాటలు ఖాతరు చేయకుండా 9వ తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులు జుట్టు విరబూసుకుని పాఠశాలకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు మంగాదేవి.. బాలికల జడలు కత్తించారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో మండల విద్యాశాఖ అధికారులు స్పందించారు. బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలు మంగాదేవిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని