Aarudra-Vizag: జగన్ మాట కంటే మంత్రి గన్మెన్ మాటే చెల్లుతోంది: ఆరుద్ర ఆవేదన
సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆరుద్ర నిరాహార దీక్షకు దిగారు.
విశాఖ: సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఆరుద్ర నిరాహార దీక్షకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆమె దీక్షకు కూర్చొన్నారు. ఆమెకు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మద్దతు పలికింది.
ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ దివ్యాంగురాలైన తన కుమార్తె సాయిచంద్రకు వైద్యసహాయం అందించాలని కోరారు. పోలీసుల తీరు వల్లే తన బిడ్డకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ మాట కంటే మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ మాటే చెల్లుతోందని ఆమె విమర్శించారు. డీఎస్పీ మురళీకృష్ణ, మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్లను పోలీసుశాఖ సస్పెండ్ చేయాలని ఆరుద్ర డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
ఆరుద్ర పోరాటం.. నేపథ్యమిదీ..
రాజులపూడి ఆరుద్రది కాకినాడ రూరల్ పరిధిలోని రాయుడుపాలేం. కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తె సాయిలక్ష్మీచంద్ర శస్త్రచికిత్స కోసం కొన్నేళ్లుగా ఆమె సాయం కోరుతున్నారు. సొంత ఇల్లు అమ్మి వైద్యం చేయిద్దామనుకుంటే మంత్రి దన్నుతో ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తన గోడు చెప్పాలని గతేడాది నవంబరు 2న సీఎం క్యాంపు కార్యాలయానికి ఆరుద్ర వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరించడానికి ప్రయత్నిస్తే కుదరదని పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఆమె మనస్తాపానికి గురై ఎడమచేతి మణికట్టు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది.
ఆరుద్ర తన కుమార్తెతో ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి గోడు తెలిపారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో.. ఈ నెల 7న కలెక్టరేట్ వద్ద కుమార్తెతో సహా నిరవధిక దీక్షకు దిగారు. ఆరోజు అర్ధరాత్రి దాటాక దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. తల్లీకుమార్తెలను కాకినాడ జీజీహెచ్కి తరలించారు. చికిత్సకు వారు సహకరించకపోవడంతో బలవంతపు వైద్యసేవలకు ప్రయత్నించారు. ఒత్తిడి చేస్తే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆరుద్ర హెచ్చరించారు. సోమవారం సాయంత్రం జీజీహెచ్లోని వార్డు వద్ద పోలీసులు భారీగా ఉండటంతో ఆరుద్ర.. ‘వెంటనే ఐసీయూ వద్దకు రండి.. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది పాపను ఏం చేస్తారోనని భయంగా ఉంది’ అంటూ మీడియాకు తెలిపారు. అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులనూ పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి దాటాక విశాఖలోని మానసిక వైద్యశాలకు ఆరుద్ర, ఆమె కుమార్తెను తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత